హక్కుల బావుటా చాకలి ఐలమ్మ

Publish Date:Sep 10, 2020

Advertisement

'ఈ భూమి నాది.. పండిన పంట నాది. తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు' అంటూ బడుగుజీవుల రక్తాన్ని పీల్చే దొరలకు ఎదురొడ్డి నిలబడిన ధీశాలి చాకలి ఐలమ్మ. దొరల గుండెల్లో మంటలు రేపిన అగ్నికణం ఆమె. తన హక్కుల కోసం ఆమె జరిపిన పోరాటం, ప్రతిఘటన మహిళాలోకానికి, యువతరానికి ఆదర్శం. భూమి కోసం.. భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాటపటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమె పేరులేనిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయన్నంత భయంతో బతుకుతున్న నేటితరానికి ఆమె మార్గదర్శి.

 

చాకలి ఐలమ్మ 1895 లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఆమెకు పదకొండేండ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్ళి అయ్యింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఐలమ్మ కుటుంబం ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు తమ ఇంటిలోనే సంఘం కార్యాలయాలన్ని ఏర్పాటుచేశారు. ఆమె ఇంటిని కేంద్రంగా చేసుకుని పాలకూర్తిలో ఆంధ్రమహాసభ కార్యక్రమాలు జరిగేవి. 

 

పాలకుర్తికి పక్కనే నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కుంటుంబమంతా కష్టపడేవారు. సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఆ ఊరి దొర రామచంద్రారెడ్డి అనేక విధాలుగా వేధించాడు. కౌలు భూమిలో పండిన పంట తీసుకుపోవడానికి తన అనుచరులను పంపించాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఐలమ్మ కుటుంబానికి అండగా నిలిచారు. కొంగు నడుముకు చుట్టి రోకలిబండ చేతపట్టుకుని దొర అనుచరులను ఆమె తరిమికొట్టారు. ఐలమ్మ సాహసంతో సాయుధపోరు ప్రారంభమైంది. రాజీ పేరుతో ఐలమ్మను గడీకి పిలిపించి ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని భయపెట్టే ప్రయత్నం చేసిన దొరకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బతకనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని అదురుబెదురు లేకుండా చెప్పింది. ఆమె ధైర్యం చూసి దొరే ఖంగు తిన్నాడు. నిజాం పాలనకు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి అయ్యింది. ఆమె స్ఫూరి కారణంగా ఊపు అందుకున్న ఉద్యమం ఫలితంగా దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. గడీల గడ్డి మెులవాలన్న ఆమె మాటలకు దేవతలు కూడా తథాస్తు అన్నట్లు దొరల రాజ్యం పోయింది, గడీల గడ్డి మొలిచింది. అగ్నికణంగా దొరల గుండెల్లో మంటలు పుట్టించిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న మరణించింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్న శ్రీశ్రీ మాటలకు ఆమె జీవితమే నిదర్శనం.

By
en-us Political News

  
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.