బనకచర్ల ప్రాజెక్టుపై 12 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమ అవసరాలకు వాడుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వినియోగానికి సంబంధించిన తగాదాపు పరిష్కరించేందుకు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. అలాగే కేంద్రం ఇద్దరు నిపుణులను నామినేట్ చేస్తుంది. ఈ కమిటీ కోసం సభ్యుల పేర్లను పంపాలని కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలనవరుల శాఖ కోరింది.
బనకచర్లపై జూన్ 16న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో హస్తినలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టుపై విభేదాల పరిష్కారంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటోందని ఏపీ వాదించింది. అయితే తెలంగాణ మాత్రం తమ రాష్ట్రం నీటి వనరు లను కోల్పోతుందని గట్టిగా వాదించింది. బనకచర్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాజీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించడంతో బనకచర్లపై పీటముడి పడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఉద్రిక్తతలూ పెరిగాయి. వాస్తవానికి బనకచర్ల రాయలసీమలో కరవును పరిష్కారానికి దోహద పడుతుందనీ, తెలంగాణ ప్రయోజనాలకు ఇసుమంతైనా నష్టం వాటిల్లదని ఏపీ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్లపై ప్రతిష్ఠంభన తొలగించే ఉద్దేశంతో కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-to-appoint-experts-committee-on-banakacharla-39-203769.html
Publish Date:Mar 12, 2026
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.