హోదా హుళ‌క్కే.. తేట‌తెల్లం చేసిన కేంద్రం

Publish Date:Jul 19, 2022

Advertisement

ఊరించి ఊరించి ఊర‌గాయ‌ బెట్టి ఆఖ‌రికి ముక్క‌లేదు త‌ర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెన‌క‌టికి ఓ బామ్మ‌గారు. అదుగో అలా మారింది ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌త్యేక హోదా తంతు. 2014లో ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా ఇస్తామ‌న్న హామీ ఇచ్చార‌నే ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణా విడిపోవ‌డానికి  అప్ప‌టి నాయ‌కులు అంగీక‌రించారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. అప్ప‌టి నుంచి హోదా గురించి ఎప్పుడు చ‌ర్చ లేదా ప్ర‌శ్న‌లు త‌లెత్తినా ఏదో మాయ‌మాట‌లు చెప్పి తెలుగు ప్ర‌జ‌ల, ప్ర‌భుత్వ ఆవేశాన్ని చ‌ల్లా ర్చ‌డం కేంద్రం పెద్ద ప‌నిగా పెట్టుకుంది. కాలం గ‌డిచిపోయింది రాష్ట్రానికి వీల‌యినంత ఆర్ధిక సాయం చేస్తామ‌ని ఊరించి అస‌లు హోదా మాట‌నే మ‌ర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్ద‌లు. 

జ‌గ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో ప్ర‌త్యేక హోదా సాధించుదామ‌నే అన్నారు. కానీ క్ర‌మేపీ కేంద్రానికి దాసోహం అన‌డంతో ఆ  మాట‌ను మార్చి ఏవేవో క‌బుర్లు చెబుతూ, జ‌గ‌న్‌ని అస‌లా అంశాన్ని ఎత్త‌కుండా చేశారు. జ‌గ‌న్ కేవ‌లం కేంద్రంలో నాయ‌కుల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యేక హోదా గురించి ఇత‌ర అంశాల గురించి ప‌ల్లెత్తు ఏమీ మాట్లాడ‌టం లేదు. జ‌నం పూర్తిగా దాని సంగ‌తే మ‌ర్చిపోయార‌న్న భ్ర‌మ‌లో కేంద్రం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఉన్నాయి. 

ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం చ‌ర్చ‌కు తెర‌లేపింది. లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు హోదాపై అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు.

రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు.  విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.
...
హోదా సాధ‌న‌కు ఒక  సుధీర్ఘ పోరాటాన్ని  వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్‌ఎస్‌ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండ‌టం ప‌ట్ల రాష్ట్రంలో విప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఈ విష‌యంలో బిజెపీని దీటుగా ఎద‌ర్కోవ‌డంలో వైసీపీ ని పూర్తిగా న‌మ్మి మోస‌పోయామ‌న్న అభిప్రాయాలే అంత‌టా విన‌వ‌స్తున్నాయి.  కేంద్రంతో కొంత స‌హ‌చ‌ర్యం వున్న జ‌గ‌న్ హోదా విష‌యంలో మాత్రం వారిని ఒప్పించ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. పైగా కేంద్రం మ‌న‌సులో మాట జ‌గ‌న్‌కు తెలిసి కావాల‌నే అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్ట‌క కాల‌క్షేపం క‌బుర్ల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేశార‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. 

By
en-us Political News

  
చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు.
ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు.
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది.
అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది.
స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.
చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి.
కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా, పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.