వైసీపీకీ కేంద్రం ఝలక్?!

Publish Date:Jul 26, 2023

Advertisement

నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ నించోమంటే నించుని, కూర్చోమంటే కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి మరీ అడుగులకు మడుగులోత్తిన జగన్ సర్కార్ కు సరిగ్గా ఎన్నికల ముందు దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.  

ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి అవకాశాలు ఇసుమంతైనా లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది.   సెయిల్ అధ్యయనం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశాలు లేవని తేల్చిందని నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు.  అయితే రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై, ఏర్పాటు చేసిన  జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ నివే దిక  ఎప్పటికి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన పేర్కొనలేదు.  కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సీమ ప్రజల ఆకాంక్ష, దానిని సాధించి తీరుతామంటూ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన సీఎం జగన్ ఇక రాయలసీమ వాసులకు ముఖం ఎలా చూపించగలరని విపక్షాలు నిలదీస్తున్నాయి.

కడన స్టీల్ ఒక్కటే అని కాదు.. విశాఖ రైల్వే జోన్ ను కూడా అటకెక్కించేసినట్లేనని నిత్యానందరాయ్ సమాధానంతో తేటతెల్లమైపోయింది.  కనీసం ఆంధ్రులు పోరాడి సాధించుకున్న కడప స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోమన్న మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయబోమని ఇంత కాలం చెబుతూ వచ్చిన సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు, ఎంపీలు, ఎంపీలు కంగుతినేలా  కేంద్రమంత్రి తాజా ప్రకటనలో  ప్రైవేటీకరణ ఉండదన్న మాట కూడా రాలేదు.  

గతంలో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయనతో,  బీజేపీ అగ్రనేతలంతా.. విశాఖ రైల్వేజోన్‌ సాధిస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. సోము వీర్రాజయితే ఒక అడుగు ముందుకేసి.. రైల్వే జోన్‌ రాదని మీకెవరు చెప్పారని మీడియాపై రుసరుసలాడారు. ఎంపి జీవీఎల్‌ కూడా పలు మీడియా సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ పై హామీలు గుప్పించారు.  ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ కు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇంత కాలం తాము చేసిన గంభీర ప్రకటనలన్నీ డొల్లేనని తేటతెల్లమయ్యేలా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనతో  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద నేల కదిలిపోయినట్లైంది.

ఇంత కాలం ఊరిస్తూ వచ్చిన బీజేపీ  వైసీపీ ఆయువుపట్టుమీద దెబ్బకొట్టినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం వైసీపీ ఏం చెబుతూ వచ్చిందో.. జగన్  పదే పదే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి ఏ డిమాండ్లైతే చేశానని చెబుతూ వచ్చారో అవన్నీ ఉత్తుత్తి మాటలే అని తేటతెల్లమయ్యేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటన ఉండటంతో  రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి నడి సంద్రంలో చుక్కాని లేని నావగా మిగిలిపోయింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటన రాజకీయంగా వైసీపీ ప్రతిష్టను, వ్యక్తిగతంగా జగన్ పరువును నిండా గంగలో ముంచేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గత ఎన్నికల ముందు తమకు ఎంపీ సీట్లు మొత్తం ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పుడిక కేంద్రంపై వైసీపీ యుద్ధ భేరి మోగించినా చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకున్న చందమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ తో అంటకాగింది జగన్ స్వప్రయోజనాల పరిరక్షణకేనని జనానికి పూర్తిగా అర్థమయ్యిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. 

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.