ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేని పరిస్థితి తెలిసిందే. లెక్కల చిట్టాలు విప్పితే తప్ప కొత్త అప్పులకు నో అంటూ కేంద్రం ఏపీకి దాదాపుగా అప్పులకు మార్గం లేకుండా దారులు మూసేసింది. అయితే ధనిక రాష్ట్రం అయిన తెలంగాణకూ అప్పుల తిప్పలు తప్పడం లేదు.
రెండు రాష్ట్రాల అప్పుల తిప్పలకు కారణాలు వేరు వేరు అయినా ఫలితం మాత్రం ఇరు రాష్ట్రాలకూ ఒకేలా ఉంది. ధనిక రాష్ట్రమే అయినా, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయే చూపిస్తోంది. ఇక ఏపీ సంగతి తెలిసిందే. ఎందుకు అప్పు తీసుకుంటోందో అందుకు వ్యయం చేస్తుందన్న గ్యారంటీ లేదు. విపత్తు నిధులను సైతం సంక్షేమ పద్దుకు మరళించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఇన్వెస్ట్ చేసేసిన చరిత్ర ఏపీది. ఏపీకి రుణం అందక అవస్థలు పడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్వయం కృతాపరాధమే. మరి తెలంగాణకూ అదే పరిస్థితి ఎందుకు? ఈ నిరాకరణ వెనుక రాజకీయం ఉందా?
మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి పరిస్థితిుల్నిచక్క బెట్టుకుందామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. ఏప్రిల్ నెలలో రూ. ఐదు వేల కోట్ల అప్పు కోసం చేసిన ప్రయత్నాలకూ సేమ్ రిజల్ట్. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి.. తమ అప్పులు.. గ్యారంటీలు.. కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపించినా, ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటేసిందన్న నెపంతో కేంద్రం కొత్త రుణాలకు మోకాలడ్డింది. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ, తాము చేసే అప్పులు భవిష్యత్ అభివృద్ధికి పెట్టుబడే నంటూ చెబుతున్న తెలంగాణ రాష్ట్రం కూడా నిబంధనలకు నీళ్లొదిలేసి పరిమితిని మించి అప్పులు చేసేసిందనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ కూడా అభివృద్ధి కంటే ఎన్నికల ముంగిట ఉచిత పందేరాల పథకాలకే అగ్ర తాంబూలమిచ్చి..మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేస్తోందన్న విపక్షాల విమర్శలకు ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటేసి మరీ అప్పులు చేసిందన్న సమాచారం ఊతమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేంద్రం నిర్వాకం కేవలం రాజకీయమేనని తెరాస ఎదురుదాడికి దిగినా గణాంకాల ఆధారంగా రాష్ట్ర పన్నుల వాటాలో కోత అనివార్యమని అర్దమౌతున్నది. తెలంగాణ పన్నుల రూపంలో రాష్ట్రానికి చెల్లించిన మొత్తం లెక్కలను చెబుతూ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు అప్పులకు అనుమతి చేసి తెలంగాణకు ఎందుకివ్వరన్న తెరాస విమర్శలు రాజకీయ ప్రయోజనాలకు పని కొస్తాయేమో కానీ, అప్పు పుట్టడానికి కాదు.ఇక ఏపీ అయితే ఏపీకి మాత్రం అలా తీసుకున్న అప్పులు, వాటిని వ్యయం చేసిన వివరాలు వెల్లడిస్తే.. అసలింక అప్పుపుట్టే పరిస్థితే ఉండదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి ఏం చేస్తాయన్నది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-demies-permission-for-new-debta-to-telangana-akso-25-135293.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.