ఏపీలో విపక్షానికి ఆయుధాన్ని అందించిన కేంద్రం!

Publish Date:Jul 20, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష తెలుగుదేశానికి కేంద్రం పదునైన ఆయుధాన్ని అందించింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చేసిన జగన్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేస్తున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా ఏపీ మరో శ్రీలంకలా మారి పోతున్నదంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. ఇంత కాలం రాష్ట్రంలోని జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకువచ్చిందని తెలుగుదేశం విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలసిందే.

ఇంత కాలం ఆ విమర్శలను పట్టించుకోకుండా.. రాష్ట్రానికి మరిన్ని అప్పులు చేయడానికి అనుమతులిస్తూ ప్రోత్సహించిన కేంద్రం.. ఉన్నట్టుండి ఏపీ ఆర్థిక పరిస్థితిపై బాంబు పేల్చి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంటూ ఏపీ సర్కార్ పై ఫైర్ అయ్యింది. శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయంటూ ఓ పది రాష్ట్రాలను వేలెత్తి చూపిన కేంద్రం.. ఆ పది రాష్ట్రాలలోనూ ఏపీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తేల్చేసింది. కేంద్రం మంగళవారం నాటి అఖిలపక్ష భేటీలో పది రాష్ట్రాలను ప్రస్తావించినా, అందులో ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించని రాష్ట్రంగా ఏపీ ముందుపీటిన ఉంది.

కేంద్రం అప్పుల విషయంలో రాష్ట్రాలకు చేసిన సూచనలు సలహాలను పక్కన పెడితే.. ఏపీ తీరు అత్యంత దారుణంగా ఉందని కుండబద్దలు కొట్టింది.  ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు విపక్ష తెలుగుదేశంకు  పదనైన ఆయుధాన్ని అందించినట్లే అయ్యింది. ఇంత కాలంగా తాము ఏం చెబుతున్నామో అది వాస్తవమేనని కేంద్రం ఖరారు చేసిందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కేంద్రం మంగళవారం ఒక్క రోజే కేంద్రం గాలి తీసేసేలా మూడు అంశాలపై క్లారిటీ ఇచ్చింది. అవి ఒకటి పోలవరం, రెండు ప్రత్యేక హోదా, మూడు క్రమశిక్షణా రాహిత్యం. ఈ మూడు విషయాలలోనూ తెలుగుదేశం ఇప్పటి వరకూ ఏ విమర్శలైతే చేస్తూ వస్తోందో అవన్నీ అక్షర సత్యాలని కేంద్రం తేల్చేసింది.

పోలవరం జాప్యానికి గత తెలుగుదేశం ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే కారణమని ఇంత కాలం బుకాయిస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన సమాధానం శరాఘాతంలా తగిలింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పోలవరం పనులు నెమ్మదించాయనీ, ఇందుకు జగన్ సర్కార్ తీరే   కారణమని కేంద్రం కుండ బద్దలు కొట్టేసింది. అవసరాలకు సరిపడా నిధులు విడుదల చేయడం దగ్గర నుంచి, ప్రణాళికా రాహిత్యం, సమన్వయలోపం, అవగాహనా రాహిత్యం కారణంగానే పోలవరం సకాలంలో పూర్తి కాలేదని తేల్చేసింది. దీంతో ఇంత కాలం జగన్ సర్కార్ చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని కేంద్రం తేల్చేసింది. అలాగే ప్రత్యేక హోదాపై వైసీపీ సర్కార్ కేంద్రంతో లాలూచీ పడిందన్న విమర్శలు వాస్తవమేనని తేల్చేస్తూ కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించింది.

గతంలో ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించడంపై విపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శలు గుప్పించి, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా.. కనీసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద కేంద్రం ఇస్తానన్న నిధుల కోసం కూడా అడగలేదు.  ఇలా ఒకే రోజున కేంద్రం ఏపీలోని జగన్ సర్కార్ బండారాన్ని బయటపెట్టే మూడు అంశాలపై స్పష్టత ఇచ్చేయడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేస్తున్నారని.. ఆర్థిక దివాళాకోరు దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోందని ప్రధాన విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అక్షర సత్యాలని కేంద్రం చెప్పకనే చెప్పింది.  

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.