టెక్స్ టైల్ పార్క్ మూత.. కేంద్రం, రాష్ట్రాలదే బాధ్యత!

Publish Date:May 2, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో  నేతన్నలకు మహర్దశ అంటూ ఊదరగొట్టిన టీఆర్ఎస్ సర్కార్.. అదే సిరిసిల్లలోని టెక్స్ టైల్ పార్క్ మూతపడి 2వేల  మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే కేంద్రం పన్నే కారణమంటూ సణుగుతోంది తప్ప.. వాస్తవంలోనికి వచ్చి టెక్స్ పార్క్ యాజమాన్యాల సమస్యల పరిష్కారంపై నోరు మెదపడం లేదు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడే నాడే నేత కార్మికుల ఉపాధికి గండి పడింది. సరిగ్గా మే 1వ తారీకునే..అంటే ఆదివారం నాడే సిరిసిట్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్కుకు యాజమాన్యాలు తాళం వేశాయి. పరిశ్రమను నడపడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. దీంతో ఆ పార్క్ లో పని చేసే దాదాపు రెండు వేల మంది నేత కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. 
 టెక్స్ టైల్ పార్క్ మూతకు విద్యుత్ రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో రాకపోవడమే ప్రధాన కారణంగా యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఏడు కోట్లు వెచ్చించి 75 ఎకరాల్లోఎకరాల్లో  2004లో  టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు.   టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలను నెలకొల్పితే సబ్సిడీలు, విద్యుత్తు రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం  హామీ ఇవ్వడంతో పలువురు పారిశ్రామికులు ముందుకొచ్చి టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలు స్థాపించారు.  165 ఇండస్ట్రీయల్ యూనిట్లు, 27 కమర్షియల్‌ యూనిట్లు  ఏర్పాటయ్యాయి. వీటిలో 115 యూనిట్లలో 1,475 ఆధునిక రాపియర్‌ మరమగ్గాలను ఏర్పాటు చేశారు.

అయితే వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఆర్డర్లు రాకపోవడం, అలాగే ప్రైవేటు ఆర్డర్లూ లేకపోవడంతో యాజమాన్యాలకు పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. కరోనా విజృంభించిన సమయంలో మార్కెట్లు పూర్తిగా స్తంభించిపోవడం, దానికి తోడు నూలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పరిశ్రమలు నష్టాల బాట పట్టాయి. అలాగే పరిశ్రమను ఏదో మేరకు ఆదుకుంటూ వస్తున్న బతుకమ్మ ఆర్డర్లు కూడా ఈ ఏడు భారీగా తగ్గిపోవడం పరిశ్రమల నిర్వహణను కష్టసాధ్యంగా మార్చింది.

అన్నిటికీ మించి ప్రభుత్వ హామీ మేరకు మౌలిక సదుపాయాలు, విద్యుత్ రాయితీలూ కూడా అందకపోవడం పార్క్ లో పరిశ్రమల మనుగడను భారంగా మార్చేశాయి.  2015 నుంచి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను విడుదల చేస్తామన్న మంత్రి కేటీఆర్ హామీ కూడా నెరవేరలేదు.  ఈ పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వహణ తమ వల్ల కాదంటూ, ప్రభుత్వ హామీలను నెరవేర్చి విద్యుత్ రీయింబర్స్ మంట్ బకాయిలు చెల్లించడమే కాకుండా.. ప్రభుత్వ హామీ మేరకు ఆర్డర్లు కూడా వచ్చేలా చేయాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరుతున్నాయి. 

వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా చేనేతలను ఆదుకునే విషయంలో మేం చాంపియన్లం అంటే మేం చాంపియన్లమన తెలంగాణలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ విమర్శలలో మునిగి తేలుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో తమ సర్కార్ చేనేతకు బడ్జెట్ కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, అది ఆయన అజ్ణాజానికి పరాకాష్ట, అసలు చేనేతపై పన్ను వేసిన తొలి సర్కార్ మోడీదే అంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పరస్పర విమర్శల పర్వానికి తెర లేపారు. వాస్తవానికి నేతల సంక్షేమంపై, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమికి సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ మూతపడటం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.