Publish Date:Oct 21, 2022
నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీతో అంటకాగితే అధికారులపై చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రుజువు చేసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావును మునుగోడు రిటర్నింగ్ అధికారి బాధ్యతల నుంచి తొలగించింది. ఇంతకీ ఆయనేం చేశారంటే.. ఒక అభ్యర్థికి ఎన్నికల గుర్తు కేటాయింపు జరిగిన తరువాత దానిని మార్చారు. ఈ విషయంలో ఆయన లేని అధికారాన్ని వినియోగించారని సీఈసీ తప్పుపట్టింది.
ఒక అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తును మార్చడం ద్వారా ఆయన.. లేని అధికారాన్ని వినియోగించారని తప్పుపట్టింది. రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తు.. తిరిగి అదే అభ్యర్థికి కొనసాగుతుందని స్పష్టం చేసింది. గంటల వ్యవధిలోనే మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్సింగ్ను నూతన ఆర్వోగా నియమించింది. మామూలుగా గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఈసీ వద్ద ఉన్న గుర్తుల జాబితా నుంచి ఒక్కొక్కరు మూడింటిని ప్రాధాన్యక్రమంలో ఎంచుకోవాలి. వాటి నుంచి లాటరీ ద్వారా గుర్తులు కేటాయిస్తారు. యుగతులసి పార్టీ నుంచి పోటీ చేస్తున్న కె.శివకుమార్ తొలి ప్రాధాన్యంగా రోడ్డు రోలర్ గుర్తును ఎంచుకున్నారు.
లాటరీలో అదే గుర్తు రావడంతో దాన్ని కేటాయిస్తున్నట్లు ఈ నెల 17వ సీఈసీ ప్రకటించింది. అయితే ఆ తరువాత అభ్యర్థి శివకుమార్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయనకు కేటాయించిన గుర్తు రోడ్ రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీంతో శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం శివకుమార్ కు మళ్లీ ఎన్నికల గుర్తునే కేటాయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రాత్రి శివకుమార్ కు రోడ్ రోలర్ గుర్తునే కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, లేని అధికారాలను వినియోగించిన మునుగోడు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి తొలగించింది. కా
గా తెలంగాణలో ఇలా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా అధికారిని విధుల నుంచి తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో అధికార తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అప్పటి సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ ఆ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cec-axe-on-munugodu-returning-officr-for-changing-election-of-a-cndidate-25-145805.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.