పేదవాడి అన్నంముద్ద ఎన్టీఆర్.. చంద్రబాబు

Publish Date:May 28, 2025

Advertisement

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి,  దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించి కృషి చేసిన  ధీరోదాత్తుడు అని పేర్కొన్నారు.  

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడిగా ఎన్టీఆర్ ను అభివర్ణించారు.   ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించి వారికి అన్నయ్యారని పేర్కొన్నారు. మండల వ్యవస్థ తీసుకురావడం ద్వారా  పాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు చేరువయ్యారనీ, అలాగే రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదలకు అన్నం ముద్దయ్యారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ప్రపంచ ముందు గర్వంగా తలెత్తుకు నిలబడాలన్నదే ఆయన సంకల్పమని చెప్పిన ఆయన... తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులే కారణమన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు నిరంతరం శ్రమించడమే ఎన్టీఆర్ కు ఇచ్చే ఘన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.  

By
en-us Political News

  
కొవ్వూరు గోష్పాద క్షేత్రం విఐపి ఘాట్ లో "యోగాంధ్ర" రాష్ట్రస్థాయి కార్యక్రమం శనివారం (జూన్ 14) విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు, వయో వృద్ధులు, మహిళలు, యువత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తో "ఆర్ట్ ఆఫ్ లివింగ్" సంస్థకు చెందిన యోగ గురువు సరోజ యోగాసనాలు వేయించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. గతంలో తన తండ్రి ఎర్రన్నాయుడుని రోడ్డు ప్రమదంలో కోల్పోయిన వారి బాధను అర్ధం చేసుకోగలని కేంద్ర మంత్రి తెలిపారు.
ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ లేక్‌వ్యూ బంజారాహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు.
ద్ద‌ర్ కి ఆస్కార్ కీ సంబంధ‌మేంట‌న్న దానిక‌న్నా.. గ‌ద్ద‌ర్ కి సినిమాల‌కూ ఉన్న సంబంధం కూడా చాలా చాలా త‌క్కువ‌. గ‌ద్ద‌ర్ ఎప్పుడో మా భూమిలో బండెన‌క బండి క‌ట్టి అనే పాట.. అది కూడా బండి యాద‌గిరి అన్న మ‌రో ర‌చ‌యిత రాసిన పాట పాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలవనున్నారు. సరిగ్గా అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళనున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది.
ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీలో అతిథి పాత్రకే పరిమితం అవుతున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల, ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలోనే పాత కాంగ్రెస్ నాయకులు కొందరు ఆశించిన రీతిలో తుమ్మలకు సహకరించలేదు.
చాలా మంది తెచ్చే పోలిక ఏంటంటే భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ విష‌యంలో ఆనాడు ర‌ఘురామ‌కృష్ణం రాజు,  నేడు కొమ్మినేని అవ‌లీల‌గా బెయిల్ తెచ్చుకోవ‌డం. ఆయ‌న‌కూ ఈయ‌న‌కూ తేడా ఇదేనంటారు.  ఆనాడు ర‌ఘురామ‌ వైసీపీలోనే ఒక రెబ‌ల్ ఎంపీ గా ఉంటూ, అధినేత జ‌గ‌న్ పై త‌ర‌చూ విరుచుకుప‌డేవారు. 
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. విమానం కుప్పకూలిపోవడం వెనుక కుట్ర కోణం ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు.
రాజధాని అమరావతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో అరెస్టయిన మరో జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు అంత వీజీ కాదని అంటున్నారు న్యాయనిపుణులు.
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా?
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.