తెలంగాణపై చంద్రబాబు గురి.. ఆ రెండు పార్టీల‌కు బిగ్‌షాక్ త‌ప్ప‌దా?

Publish Date:Dec 29, 2024

Advertisement

తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌క్రం తిప్పేందుకు తెలంగాణ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌వుతున్నారా?  గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ప‌నిచేసిన‌ నేత‌ల‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ‌లోనూ పార్టీ జెండాను రెప‌రెప‌లాడించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అందుకోసం, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ టీం ఇప్ప‌టికే రంగంలోకి దిగిందా? ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి పార్టీ బ‌లోపేతానికి అడుగులు వేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌య్యాయా? అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌యాంలో తెలంగాణ‌లో  తెలుగుదేశం బ‌ల‌మైన పార్టీగా కొనసాగింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటైన త‌రువాత కూడా తెలుగుదేశం పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గ‌లేదు. ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఆ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. గ‌త ఏడాది జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీని గ‌ద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. తెలంగాణలో రాజ‌కీయాల‌ను తారుమారు చేయ‌గిలిగే స‌త్తా ఉన్న తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లువురు ముఖ్య‌నేత‌ల‌తో చంద్ర‌బాబు మంత‌నాలు  జ‌రిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే రెండేళ్ల‌లో జిల్లాల వారిగా పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే చంద్ర‌బాబు, లోకేశ్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా ఏపీ రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసి విజ‌యం సాధించింది.  2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు ఏపీలో ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిన‌ప్ప‌టికీ ఏపీ అభివృద్ధిపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టి తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసా రించ‌ లేక‌పోయారు. దీంతో తెలంగాణ తెలుగుదేశంలోని ముఖ్య‌నేత‌లు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే, కీల‌క‌ నేత‌లంతా పార్టీని వీడిన‌ప్ప‌టికీ క్యాడ‌ర్ మాత్రం చెక్కుచెద‌ర‌లేదు.

  2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జాకూటమి త‌ర‌పున టీడీపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు పోటీ చేయ‌గా.. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం కొత్త‌గూడెం జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఆ తరువాత కొద్దికాలానికే వారు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మ‌రోవైపు ఏపీలో 2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఏపీలో పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికే చంద్ర‌బాబు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో  2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ‌లో తెలుగుదేశం పోటీచేసే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే, ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ అయిన స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపేందుకు ప్ర‌య‌త్నించారు. ముఖ్యంగా హైద‌రాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రోడ్ల‌పైకి వ‌చ్చి చంద్ర‌బాబు అరెస్టును ఖండించారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర‌స‌న తెలిపేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. పైగా.. ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ అయితే మా రాష్ట్రంలో నిర‌స‌న‌లు ఎందుకు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో తెలంగాణ‌లోని తెలుగుదేశం సానుభూతిప‌రులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చారు.   

తెలంగాణ‌లో 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి తెలుగుదేశం దూరంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలు,  సానుభూతిప‌రులు  బ‌హిరంగంగానే కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెలిపారు. చంద్ర‌బాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో బీఆర్ఎస్ లోని తెలుగుదేశం సానుభూతిప‌రులు సైతం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి  తెలుగుదేశం ఓ ప్ర‌ధాన కార‌ణంగా మారింది. ఇటీవ‌ల ఏపీలో తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి రావ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వైసీపీ హ‌యాంలో ఏపీ అభివృద్ధిలో వెనుక‌బాటుకు గురైంది. దీంతో మ‌ళ్లీ తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపించేందుకు చంద్ర‌బాబు కృషి చేస్తున్నారు. అయితే, ఈసారి ఏపీలో అభివృద్ధితో పాటు తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌లోపేతంపైనా చంద్ర‌బాబు దృష్టి సారించారు.  

వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు తెలంగాణ తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌స్తున్నారు. ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై వారితో చ‌ర్చిస్తూ అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ లో ప్ర‌శాంత్ కిశోర్‌, పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ కంపెనీ షో టైమ్ రాబిన్ శ‌ర్మ‌ల‌తో చంద్ర‌బాబు, నారా లోకేశ్ భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. వీరి భేటీలో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకువచ్చేందుకు  ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు  చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ తెలుగు దేశంలో చేరేందుకు ప‌లువురు నేత‌లు సిద్ధ‌మ‌య్యారు. తీగ‌ల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేర‌తాన‌ని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే  చంద్ర‌బాబుతో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీడీపీలో కీల‌కంగా ప‌నిచేసిన ప‌లువురు నేత‌లు మ‌ళ్లీ సొంత గూటికి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని, రాబోయే కాలంలో తెలంగాణ‌లో టీడీపీ పూర్వ‌వైభవం సంత‌రించుకోవ‌టం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. 

తెలంగాణ‌లో టీడీపీ పూర్వ‌వైభవాన్ని సంత‌రించుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, బీఆర్ఎస్ పార్టీకీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని రాజ‌కీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం నుంచి వెళ్లిన క్యాడ‌రే అధికంగా ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం మళ్లీ బలోపైతం అయితే వారంతా  తిరిగి సొంత‌గూటికి చేరే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి విజ‌యంలో  తెలుగుదేశం  క్యాడ‌ర్ కీల‌క భూమిక పోషించింది. వారంతా వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి  పూర్తిగా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం  అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ డంపై దృష్టిసారిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీల‌కు గట్టి షాక్ తగలడం ఖాయం. దీంతో ఏపీ త‌ర‌హాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో  తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తే అధికార పీఠం ఖాయ‌మ‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. చంద్ర‌బాబు వ్యూహంకూడా అదేన‌ని తెలుగుదేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మొత్తానికి చంద్ర‌బాబు గురి తెలంగాణ‌పై మ‌ళ్ల‌డంతో టీడీపీ శ్రేణులు, సానుభూతిప‌రుల్లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్నది.

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.