టీడీపీ ఎమ్మెల్యేల అతి.. బాబు ఆగ్రహం!

Publish Date:Aug 21, 2025

Advertisement

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటారు. అధినేత చంద్రబాబు కనుసైగలతో పార్టీ నడుస్తుంటుంది. అందరిదీ ఒకే లైన్. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి లైన్ వారిదే అన్నట్లుగా కొందరు తెలుగదేశం మ్మెల్యేలు వ్యవహరిస్తుండడం టీడీపీ హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా సమస్యలు వస్తాయనడానికి ఇదే ఎగ్జాంపుల్ కావొచ్చు. గత ఎన్నికల్లో తెలుగుదేశం 144 సీట్లలో పోటీ చేస్తే 135 స్థానాలలో గెలిచింది. అంత పెద్ద స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది.  అయితే ఇంతమందిని మెయింటేన్ చేయడం వీలు కావట్లేదా? లేదంటే భారీ మెజార్టీ ఉందన్న ధీమా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందా? ఓవైపు కూటమి ఇమేజ్ ను పెంచడం కోసం  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. ఇంకోవైపు డ్యామేజ్ చేయడంలో టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకువెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. దారి తప్పుతున్న వారందరికీ సెట్ రైట్ చేసే ప్రోగ్రామింగ్ ను సీఎం చంద్రబాబు రెడీ చేయాల్సిన టైం వచ్చేసిందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. 

 శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి. పార్టీలో ఈయన సీనియర్ లీడర్. మొన్నటిదాకా పెద్దగా వివాదాల జోలికి వెళ్లని బుడ్డా లేటెస్ట్ గా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అనుమతి లేకుండా తన సెగ్మెంట్ లో కార్యక్రమాలు నిర్వహించారంటూ పార్టీ ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విషయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొందరు అనుచరులు ఏరాసు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆ పంచాయితీ చంద్రబాబు దగ్గరకు చేరింది. అది చల్లారక ముందే లేటెస్ట్ గా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా చేయి చేసుకోవడం పెను వివాదంగా మారింది.  ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నట్లుగానే కేసు ఫైల్ అయింది. 

ఇక అనంతపురం అర్బన్   ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గొడవేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారన్నది అభియోగం. 3 నిమిషాల 8 సెకన్లు ఉన్న ఆడియో రికార్డింగ్ చుట్టూ ఏపీలో పెను దుమారమే చెలరేగింది. వార్ 2 సినిమా బెనిఫిట్‌ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్ననట్లు ఎమ్మెల్యే చెప్పడం, పర్మిషన్లు ఉన్నాయని ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు ఆ ఆడియోలో వినిపించింది. అంతే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టి, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేశారు. ఇది అనంతపురానికే పరిమితం కాలేదు. విజయవాడ, తిరుపతి, నెల్లూరుకూ పాకింది.  దీనిపై రియాక్ట్ అయిన దగ్గుపాటి, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని, ఏఐ అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ఆడియో సృష్టించారని వాదించారు. తాను నందమూరి, నారా కుటుంబాల అభిమానినని, ఎన్టీఆర్ అభిమానుల భావోద్వేగాలను గాయపరిచినట్లయితే క్షమాపణలు చెబుతున్నానని వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే అభిమానుల ఆగ్రహం తగ్గలేదు.

నిజానికి అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో దగ్గుపాటి ప్రసాద్ కు చాలా కాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం గతంలోనూ జరిగాయి. దమ్ముంటే రాజీనామా చేసి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం అని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే సవాల్ చేశారు. ఇన్ని గొడవల మధ్యలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఆడియో ఇష్యూ ప్రసాద్ మెడకు చుట్టుకుంది. ఈ మ్యాటర్ అటు పార్టీ పరంగా, సామాజికపరంగా సున్నితమైంది కావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు కూడా. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్‌ చేసుకుంటున్నారని చివాట్లు పెట్టారంట.

ఇక ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్‌ కు అర్ధరాత్రి వీడియో కాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అయితే కూన రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను అర్ధరాత్రి కాల్ చేయలేదని, ఆ కాల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు మరికొందరు ఉన్నారని, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని వాదించారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ ఎపిసోడ్ కూడా రకరకాల మలుపులు తిరుగుతోంది. 
గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి మార్ఫింగ్ వీడియోలు అని క్లారిటీ ఇచ్చుకున్నా.. ఈ ఘటనపై విమర్శలు రావడంతో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.  అటు నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కీ రోల్ పోషించారన్న మ్యాటర్ లో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, మరో ఎమ్మెల్యే ఇరుక్కున్నారు. తన తప్పేమీ లేదని ఒకరు వివరణ ఇచ్చుకుంటే మరో ఎమ్మెల్యే చుట్టూ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక్కరూ మాట్లాడడం లేదు. సో ఈ ఘటనలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేల వ్యక్తిగత వివాదాలు కాస్తా పార్టీకి మైనస్ గా మారే పరిస్థితులు తీసుకొచ్చాయి.

ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. గురువారం (ఆగస్టు 21) కేబినెట్ భేటీకి కొద్ది ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ వారి పట్ల ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే హోంమంత్రి అనితను పెరోల్ ఆర్డర్లపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కూడా సున్నితంగా  మందలించారు. మరో వైపు పార్టీ ఇన్ చార్జ్ ల తీరు కూడా కొండకచో వివాదంగా మారుతోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అతి చేస్తున్నారన్న విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. తీరు  మార్చుకోకుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలూ చేసింది. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.