Publish Date:Jan 15, 2025
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని కోరుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను అందించిన రైతులకు సీఆర్డీయే పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలలో పాటు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.
అయితే జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు కౌలు కూడా నిలిపివేసింది జగన్ సర్కార్.అయితే రైతులు న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగి వచ్చి విడతల వారీగా కౌలు సొమ్ములను అమరాతి రైతుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ఏడాదది ముందు నుంచి రైతులకు కౌలు సొమ్ముల జమను నిలిపివేసింది. ఎన్నికలలో జగన్ సర్కార్ ఘోర పరాజయం పాలు కావడం, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాదిన్న కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి రైతుల కౌలు సొమ్ములను సరిగ్గా పండుగ వేళ వారి ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.
అంతే కాకుండా జగన్ హయాం అప్పట్లో అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి చేసిన భూ కేటాయింపులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను తిరిగి సీఆర్డేయేకు అప్పగించింది. అమరావతి రైతులకు ప్రయోజనం కలిగేలా తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్లా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-pongal-fift-to-amarawathi-farmers-39-191308.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.