Publish Date:Jan 15, 2025
అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని కోరుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను అందించిన రైతులకు సీఆర్డీయే పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలలో పాటు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.
అయితే జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు కౌలు కూడా నిలిపివేసింది జగన్ సర్కార్.అయితే రైతులు న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగి వచ్చి విడతల వారీగా కౌలు సొమ్ములను అమరాతి రైతుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ఏడాదది ముందు నుంచి రైతులకు కౌలు సొమ్ముల జమను నిలిపివేసింది. ఎన్నికలలో జగన్ సర్కార్ ఘోర పరాజయం పాలు కావడం, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాదిన్న కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి రైతుల కౌలు సొమ్ములను సరిగ్గా పండుగ వేళ వారి ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.
అంతే కాకుండా జగన్ హయాం అప్పట్లో అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి చేసిన భూ కేటాయింపులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను తిరిగి సీఆర్డేయేకు అప్పగించింది. అమరావతి రైతులకు ప్రయోజనం కలిగేలా తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్లా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-pongal-fift-to-amarawathi-farmers-25-191309.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!