Publish Date:Oct 13, 2025
ఏపీలో పెను దుమారం రేపిన కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడం.. ఆ తరువాత తీగలాగితే డొంక కదిలిన చందంగా దీని వెనుక ఉన్న రాజకీయ లింకులు వెలుగులోకి వచ్చాయి. అలానే నిందితులు కూడా ఒకరి వెంట ఒకరు అఅన్నట్లుగా బయటపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది.
విషయమేంటంటే.. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారానికీ ఇబ్రహీంపట్నంలో బయటపడిన కల్తీ మద్యం బాటిళ్లకూ లింకు ఉండటంతో.. రాష్ట్రంలో అసలు నాణ్యమైన మద్యం దొరుకుతోందా.. తాము తాగేదంతా కల్తీ మద్యమేనా అన్న భయం మందుబాబుల్లో కలిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం గుట్టురట్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. అదే సమయంలో మొత్తంగా కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం (అక్టోబర్ 12)న ఉండవల్లిలో మీడియా సమావేశంలో ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని చెప్పిన చంద్రబాబు వైసీపీ హయాం నుంచి తమ ప్రభుత్వానికి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందన్నారు. కల్తీ మద్యం మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన చంద్రబాబు న కల్తీ మద్యం కేసులో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్ షాపుల బెల్ట్ తీస్తామన్నారు.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఈ యాప్ ద్వారా బాటిళ్ల ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విషయంలో తమకు తనపర బేధం లేదన్న చంద్రబాబు.. దీనిలో ఎవరున్నా వదిలే ప్రశక్తే లేదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు, ట్రాన్స్పోర్ట్ కూడా సొంత వాళ్లకు ఇచ్చారు, ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి పూర్తిగా చెక్ పెడతామని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-launches-suraksha-app-25-207819.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.