కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. హస్తినలో చంద్రబాబు బిజీబిజీ

Publish Date:Jul 16, 2025

Advertisement

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు.  వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు క‌ృషి చేస్తున్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఢిల్లీలో బుధవారం (జులై 16) రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు  కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు.

ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణాహబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని మన్సుఖ్ మాండవీయను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
పులివెందుల‌లో గెల‌వ‌గానే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెల‌వ‌డం సాధ్య‌మేనా? ఇదీ వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌. అదే కుప్పంలో గెల‌వ‌గానే వైసీపీ ఆంధ్ర అంత‌టా విజ‌యం సాధించిన‌ట్టేనా? ఇది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా వినిపించే ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద తెలుగుదేశం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఎక్క‌డైతే వైసీపీ బ‌లంగా ఉందో.. అక్క‌డే దెబ్బ కొట్టాల‌న్న‌ది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
ట్రంప్ అస‌లు బాధంతా ఇదే. గ‌త అధ్య‌క్షుల‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య‌ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మొద‌లైంది.
పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్టు చేస్తుందా? అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో మూడు వందే భారత్‌ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.
తిరుమలలో టీటీడీ బోర్డు నిబంధనలను మాజీ సీఎం జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉల్లంఘించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.