Publish Date:Jan 24, 2025
రాష్ట్ర ప్రయోజనాలు తప్ప విశ్రాంతి, విరామం అన్న మాటే ఆయనకు తెలియదు. వరుసగా నాలుగు రోజుల పాటు దావోస్ లో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కూడా క్షణం తీరిక లేకుండా కేంద్ర మంత్రులతో వరస భేటీలకు రెడీ అయిపోయారు. దావోస్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు గురువారం (జనవరి 23) ముగిసింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ నాలుగు రోజులూ చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని ఏపీ బ్రాండ్ ను సక్సెస్ ఫుల్ గా ప్రమోట్ చేశారు.
ఈ సదస్సు వేదికగా రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అన్న ప్రకటనలేవీ వెలువడలేదు. ఆర్భాటపు ప్రకటనల జోలికి పోకుండా బ్రాండ్ ఏపీ ప్రమోషన్.. వాస్తవాల ప్రాతిపదికన తాము చర్చించిన సంస్థలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడుల ప్రకటన చేయాలని కోరారు. చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యం నెరవేరింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు త్వరలో తమ ప్రతినిథి బృందాన్ని ఏపీకి పంపనున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి దావోస్ ఆర్థిక సదస్సు ఉద్దేశం కూడా అదే.
దావోస్ వేదికగా ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోనం సదస్సు పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి. ఈ సదస్సు వేదికగా ఇటు ఇన్వెస్టర్లు, అటు ఆ ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షించాలనుకునే వారు తమ తమ అవకాశాలను అక్కడ ప్రజంట్ చేసుకుంటారు. హడావుడి ఒప్పందాల కంటే వాస్తవాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చేసుకునే ఒప్పందాలే గ్రౌండ్ అవుతాయి. అలా కాకుండా సదస్సులో ఆర్భాటంగా చేసుకునే ఎంవోయూలలో గ్రౌండింగ్ అయ్యేవి చాలా చాలా తక్కువ. ఆ రకంగా చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ ను సక్సెస్ ఫుల్ గా చేశారనే చెప్పాలి. ఇక ముందు ఏపీకి కంపెనీల ప్రతినిధులు క్యూ కడతారని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన విజన్, ఆయన అనుభవం, ఆయన అమలు చేసే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల గురించి తెలియని పారిశ్రామిక వేత్త లేరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత ఆయనదే.
ఇప్పుడు ఆయన బ్రాండ్ ఏపీ గురించి ప్రమోట్ చేశారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం (జనవరి 23) అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇక శుక్రవారం (జనవరి 24) ఆయన హస్తినలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపి అదే రోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. హస్తినలో ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషీ తదితరులతో భేటీ అవుతారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోనూ భేటీ అవుతారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-busy-in-delhi-39-191762.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.