కూటమి ప్రభుత్వం శుక్రవారంసెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో పని చేసినట్టు విన్నానని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ లర్ గా ఆపై ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా సేవలందించారని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక పనిలో పనిగా తన కుమారుడు లోకేష్ చదువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. తన కుమారుడు మొదట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారన్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజకీయ నాయకుల పిల్లలు పెద్దగా చదవక పోయేవారని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చదువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్, సింగపూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల పని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయన స్వయం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఆయన తల్లి భువనేశ్వరి పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు సీఎం చంద్రబాబు.
సరిగ్గా అదే సమయంలో తాను లెక్చరర్ కావల్సిందని అన్నారు. తన వర్శిటీలో ఈ దిశగా వైస్ చాన్సలర్ అడిగారని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పానని అన్నారు. ఆయన తనను గెలుస్తావా? అని కూడా అడిగారని.. గెలిచి వచ్చి మీతో మాట్లాడతానని తాను అన్నాననీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు మంత్రి ఆపై ముఖ్యమంత్రి కాగలిగాననీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచర్నయి ఉండేవాడ్నని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-became-politician-instedof-teacher-39-205690.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.