కూటమి ప్రభుత్వం శుక్రవారంసెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయన మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో పని చేసినట్టు విన్నానని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ లర్ గా ఆపై ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా సేవలందించారని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక పనిలో పనిగా తన కుమారుడు లోకేష్ చదువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. తన కుమారుడు మొదట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారన్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజకీయ నాయకుల పిల్లలు పెద్దగా చదవక పోయేవారని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చదువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్, సింగపూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల పని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయన స్వయం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో ఆయన తల్లి భువనేశ్వరి పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు సీఎం చంద్రబాబు.
సరిగ్గా అదే సమయంలో తాను లెక్చరర్ కావల్సిందని అన్నారు. తన వర్శిటీలో ఈ దిశగా వైస్ చాన్సలర్ అడిగారని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పానని అన్నారు. ఆయన తనను గెలుస్తావా? అని కూడా అడిగారని.. గెలిచి వచ్చి మీతో మాట్లాడతానని తాను అన్నాననీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు మంత్రి ఆపై ముఖ్యమంత్రి కాగలిగాననీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచర్నయి ఉండేవాడ్నని గతాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-became-politician-instedof-teacher-25-205691.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.