Publish Date:Jul 17, 2025
((ఫోటో చెప్పిన కథ)
సమర్ధుడి చెమట బిందువు కూడా పిల్లల్ని పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని అంటారు పెద్దలు. అలాంటి సమర్ధుడిగా చంద్రబాబు నాయుడ్ని అభివర్ణించకుండా ఉండలేమంటారు కొందరు. ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనాలనిపిస్తోందనీ చెబుతారు.
అప్పట్లో బాబు తీసుకున్న ఒకానొక నిర్ణయం తర్వాతి రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినా.. తర్వాత రాష్ట్రం రెండుగా చీలినా.. ఆయనకేం ఫరక్ పడలేదు. ఆయన నవ్యాంధ్రకూ తొలి ముఖ్యమంత్రి కాగలిగారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను తయారు చేసిన పేరు కూడా సాధించగలిగారు.
మొదట తన మంత్రి మండలిలోకి కొత్తగా పీజేఆర్ పై గెలిచిన విజయరామారావుకి మంత్రి పదవి ఇద్దామని భావించిన ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ని పక్కన పెట్టారు చంద్రబాబు. దీంతో అలిగిన కేసీఆర్.. తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకెళ్లి కొత్త పార్టీ పెట్టి ఆపై తెలంగాణ ఏర్పాటుకు కారణం కావడం మాత్రమే కాదు.. సీఎం కూడా అయ్యారు. పదేళ్లు కొత్త రాష్ట్రాన్ని పాలించారు.
దాంతో మరో దారి లేక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ ఎంపీ కావడం, ఆపై టీపీసీసీ చీఫ్ కావడం.. తర్వాతి కాలంలో తెలంగాణకు సీఎం కాగలిగారు. ఇప్పుడు చూస్తే తన గురువుతో సమానంగా తాను కూడా ఒక ముఖ్యమంత్రిగా సత్స మానమైన హోదాలో ఆయన్ను కలిసి అభివాదం చేశారు. చంద్రబాబు కూడా తన శిష్యుడ్ని అభినందించారు. ఎన్నో రకాల బహుమతులిచ్చారు.
ఇది కదా అసలు రాజకీయమంటే.. ఒక నాయకుడంటే కేసీఆర్ పరిభాషలో చెబితే.. తాను మాత్రమే నాయకుడిగా ఉండి.. ఇతరులను పనికిమాలిన చవట- దద్దమ్మ- సన్నాసులను చేయడం కాదు. తనతో సమానమైన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకోవడం. అదే బాబు చేసి చూపించారని అంటారు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-and-revanth-meet-in-delhi-39-202125.html
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.