చంద్ర‌బాబు, ప‌వ‌న్ బిగ్‌ప్లాన్‌.. రేషన్ బియ్యం మాఫియాకు ఇక దడదడే!

Publish Date:Dec 3, 2024

Advertisement

రేష‌న్ బియ్యం దందాకు కూట‌మి ప్ర‌భుత్వం చెక్ పెట్ట‌బోతోందా.. బియ్యం మాఫియా వెనుక ఉన్న సూత్ర‌దారుల లెక్క తేల్చ‌డ‌మే కూట‌మి పెద్ద‌ల టార్గెటా..  కూక‌టివేళ్ల‌తో  బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని పెకలించి వేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు ప‌డుతున్నాయా.. తాజాగా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీలో జ‌రిగిన చ‌ర్చ‌ను ప‌రిశీలిస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా షిప్ ల ద్వారా దేశ స‌రిహ‌ద్దులు దాటిస్తున్న మాఫియాపై కూట‌మి ప్ర‌భుత్వం గురిపెట్టింది.

అయితే,  ఈ ప్ర‌క్రియ‌ ఏదో ఆషామాషీగా, హ‌డావుడిగా మొద‌లు పెట్టింది కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాపై ఫోక‌స్ పెట్టింది. మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ అస‌లు దందా ఎలా జ‌రుగుతుంది.. దానికి కార‌ణం ఏమిటి.. ఎలా రేష‌న్‌ బియ్యం అక్ర‌మ ర‌వాణా దందాకు చెక్ పెట్టాల‌నే విష‌యాలపై చంద్ర‌బాబు, ప‌వ‌న్, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ క‌నుస‌న్న‌ల్లో సీక్రెట్ ఆప‌రేష‌న్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ దందాపై ఓ అవ‌గాహ‌నకు వ‌చ్చిన త‌రువాత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌.. ఈ విష‌యంపై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు  తెర‌లేచింది. ఆ త‌రువాత రేష‌న్ బియ్యం మాఫియా దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రావ‌డం.. వెంట‌నే రేష‌న్ బియ్యం మాఫియాకు చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. తాజాగా చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ కావ‌డంతో ఈ ప్ర‌క్రియ అంతా వ్యూహాత్మ‌కంగానే జ‌రిగిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌డానికి పోర్టులే కార‌ణ‌మా.. అస‌లు రీజ‌న్ ఇంకా ఏమైనా ఉందా అనే అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం రేష‌న్ బియ్యం తీసుకుంటున్న‌వారిలో 80శాతం మంది ఆ బియ్యాన్ని రేష‌న్ మాఫియాకు విక్ర‌యిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి కిలో బియ్యానికి రూ. 40 ఖ‌ర్చుచేసి తెల్ల‌రేష‌న్ కార్డుదారుల‌కు ఒక రూపాయికే అందిస్తున్నాయి. అయితే, ఈ బియ్యాన్ని అధిక‌ శాతం మంది రేష‌న్‌ మాఫియాకు రూ. 10 నుంచి 12 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. వారు మాఫియా సామ్రాజ్యం న‌డిపిస్తున్న వారికి రూ.22 చొప్పున విక్ర‌యిస్తున్నారు.. ఆ త‌రువాత ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు ర‌వాణా చేసి అక్క‌డ భారీ ధ‌ర‌కు విక్ర‌యాలు చేస్తూ కోట్లు గ‌డిస్తున్నారు. ఇలా ఒక్కో నెల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌లు మాఫియా సామ్రాజ్యాన్ని న‌డిపేవారు త‌మ జేబుల్లో వేసుకుంటున్నారు. అయితే, ఈ దందాకు అస‌లు సూత్ర‌దారులు వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషించిన వారేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ త‌తంగమంతా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లూ వినిపిస్తున్నాయి. దందాను మ‌రింత విస్తృతం చేసేందుకే గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రేష‌న్ బియ్యాన్ని ఇంటింటికి స‌ర‌ఫ‌రా చేసేందుకు వాహ‌నాల‌ను కొనుగోలు చేసింద‌న్న వాద‌న ఉంది. ఆ వాహ‌నాల ద్వారానే రేష‌న్ బియ్యాన్ని నేరుగా మాఫియా దారుల వ‌ద్ద‌కు చేర్చేవార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కోట్లాది రూపాయ‌లు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు.. ఇత‌ర పార్టీల్లోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కాకినాడ పోర్టు వేదిక‌గా వేళ్లూనుకుపోయిన రేష‌న్ బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు న‌డుంబిగించింది. ఇందులో భాగంగా వ్యూహాత్మ‌కంగా అడుగులువేస్తూ మాఫియా దారుల్లో వ‌ణికు పుట్టించ‌డంతో పాటు.. ఇందులో ప్ర‌మేయం ఉన్న వైసీపీ నేత‌ల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్టేందుకు ప్లాక్కా ప్లాన్ తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ముందుకు సాగుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు బ‌హిర్గ‌త‌మ‌వుతున్నది. కాకినాడ పోర్టు అర‌బిందో చేతిలో ఉంది. అత‌ను వైసీపీ ఎంపీకి బంధువు. అయితే, తొలుత కేవీ రావు చేతిలో పోర్టు ఉండేది.. ఆయ‌న‌కు పోర్టులో అత్య‌ధికంగా 41శాతం వాటా ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేరుగా రంగంలోకిదిగి కేవీ రావును బెదిరింపుల‌కు గురిచేసి కాకినాడ పోర్టును అర‌బిందోకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. అర‌బిందో చేతిలోకి కాకినాడ పోర్టు వ‌చ్చిన త‌రువాత విశాఖ‌, గంగ‌వ‌రం, కృష్ణ‌ప‌ట్నం కంటే ఎక్కువ ఎగుమతి జ‌రుగుతూ వ‌చ్చింది. గ‌డిచిన మూడేళ్ల కాలంలో కోటీ31ల‌క్ష‌ల ట‌న్నుల ఎగుమ‌తి జ‌రిగింద‌ని ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రకటించారు. గ‌త మూడేళ్ల‌లో 45 వేల కోట్ల రూపాయ‌ల విలువైన బియ్యాన్ని కికానాడ పోర్టు ద్వారా త‌ర‌లించారు. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాను అరిక‌ట్టేందుకు ముందుకుసాగుతుంది. దీంతో ఈ మాఫియాలో భాగ‌స్వాములుగా ఉన్న వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కూట‌మి నేత‌లు లేవ‌నెత్తుత‌ున్న అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు విష‌యాన్ని తెరమీదకు వచ్చారు.  మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు. అంబ‌టి రాంబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం లేవ‌నెత్తిన అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని అర్థమౌతోంది. ఇదిలాఉంటే మ‌రోవైపు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా అంశంపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్నారు.  అయితే, ప‌వ‌న్ భేటీ ముగిసిన‌ త‌రువాత చంద్ర‌బాబుతో ఏపీ డీజీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు, ఇంటెలిజెన్స్ డీజీపీ మ‌హేశ్ చంద్ర ల‌డ్డా భేటీ అయ్యారు. కాకినాడ వేదిక‌గా రేష‌న్ బియ్యం దందాకు అడ్డుక‌ట్ట వేసే విష‌యంపై చ‌ర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో క‌మిటీవేసే ఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో  రేష‌న్ బియ్యం దందా వ్య‌వ‌హారం ఎప్పుడు ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.