చంద్ర‌బాబు, ప‌వ‌న్ బిగ్‌ప్లాన్‌.. రేషన్ బియ్యం మాఫియాకు ఇక దడదడే!

Publish Date:Dec 3, 2024

Advertisement

రేష‌న్ బియ్యం దందాకు కూట‌మి ప్ర‌భుత్వం చెక్ పెట్ట‌బోతోందా.. బియ్యం మాఫియా వెనుక ఉన్న సూత్ర‌దారుల లెక్క తేల్చ‌డ‌మే కూట‌మి పెద్ద‌ల టార్గెటా..  కూక‌టివేళ్ల‌తో  బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని పెకలించి వేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు ప‌డుతున్నాయా.. తాజాగా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీలో జ‌రిగిన చ‌ర్చ‌ను ప‌రిశీలిస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా షిప్ ల ద్వారా దేశ స‌రిహ‌ద్దులు దాటిస్తున్న మాఫియాపై కూట‌మి ప్ర‌భుత్వం గురిపెట్టింది.

అయితే,  ఈ ప్ర‌క్రియ‌ ఏదో ఆషామాషీగా, హ‌డావుడిగా మొద‌లు పెట్టింది కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాపై ఫోక‌స్ పెట్టింది. మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ అస‌లు దందా ఎలా జ‌రుగుతుంది.. దానికి కార‌ణం ఏమిటి.. ఎలా రేష‌న్‌ బియ్యం అక్ర‌మ ర‌వాణా దందాకు చెక్ పెట్టాల‌నే విష‌యాలపై చంద్ర‌బాబు, ప‌వ‌న్, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ క‌నుస‌న్న‌ల్లో సీక్రెట్ ఆప‌రేష‌న్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ దందాపై ఓ అవ‌గాహ‌నకు వ‌చ్చిన త‌రువాత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌.. ఈ విష‌యంపై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు  తెర‌లేచింది. ఆ త‌రువాత రేష‌న్ బియ్యం మాఫియా దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రావ‌డం.. వెంట‌నే రేష‌న్ బియ్యం మాఫియాకు చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. తాజాగా చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ కావ‌డంతో ఈ ప్ర‌క్రియ అంతా వ్యూహాత్మ‌కంగానే జ‌రిగిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌డానికి పోర్టులే కార‌ణ‌మా.. అస‌లు రీజ‌న్ ఇంకా ఏమైనా ఉందా అనే అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం రేష‌న్ బియ్యం తీసుకుంటున్న‌వారిలో 80శాతం మంది ఆ బియ్యాన్ని రేష‌న్ మాఫియాకు విక్ర‌యిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి కిలో బియ్యానికి రూ. 40 ఖ‌ర్చుచేసి తెల్ల‌రేష‌న్ కార్డుదారుల‌కు ఒక రూపాయికే అందిస్తున్నాయి. అయితే, ఈ బియ్యాన్ని అధిక‌ శాతం మంది రేష‌న్‌ మాఫియాకు రూ. 10 నుంచి 12 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. వారు మాఫియా సామ్రాజ్యం న‌డిపిస్తున్న వారికి రూ.22 చొప్పున విక్ర‌యిస్తున్నారు.. ఆ త‌రువాత ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు ర‌వాణా చేసి అక్క‌డ భారీ ధ‌ర‌కు విక్ర‌యాలు చేస్తూ కోట్లు గ‌డిస్తున్నారు. ఇలా ఒక్కో నెల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌లు మాఫియా సామ్రాజ్యాన్ని న‌డిపేవారు త‌మ జేబుల్లో వేసుకుంటున్నారు. అయితే, ఈ దందాకు అస‌లు సూత్ర‌దారులు వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషించిన వారేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ త‌తంగమంతా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లూ వినిపిస్తున్నాయి. దందాను మ‌రింత విస్తృతం చేసేందుకే గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రేష‌న్ బియ్యాన్ని ఇంటింటికి స‌ర‌ఫ‌రా చేసేందుకు వాహ‌నాల‌ను కొనుగోలు చేసింద‌న్న వాద‌న ఉంది. ఆ వాహ‌నాల ద్వారానే రేష‌న్ బియ్యాన్ని నేరుగా మాఫియా దారుల వ‌ద్ద‌కు చేర్చేవార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కోట్లాది రూపాయ‌లు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు.. ఇత‌ర పార్టీల్లోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కాకినాడ పోర్టు వేదిక‌గా వేళ్లూనుకుపోయిన రేష‌న్ బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు న‌డుంబిగించింది. ఇందులో భాగంగా వ్యూహాత్మ‌కంగా అడుగులువేస్తూ మాఫియా దారుల్లో వ‌ణికు పుట్టించ‌డంతో పాటు.. ఇందులో ప్ర‌మేయం ఉన్న వైసీపీ నేత‌ల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్టేందుకు ప్లాక్కా ప్లాన్ తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ముందుకు సాగుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు బ‌హిర్గ‌త‌మ‌వుతున్నది. కాకినాడ పోర్టు అర‌బిందో చేతిలో ఉంది. అత‌ను వైసీపీ ఎంపీకి బంధువు. అయితే, తొలుత కేవీ రావు చేతిలో పోర్టు ఉండేది.. ఆయ‌న‌కు పోర్టులో అత్య‌ధికంగా 41శాతం వాటా ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేరుగా రంగంలోకిదిగి కేవీ రావును బెదిరింపుల‌కు గురిచేసి కాకినాడ పోర్టును అర‌బిందోకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. అర‌బిందో చేతిలోకి కాకినాడ పోర్టు వ‌చ్చిన త‌రువాత విశాఖ‌, గంగ‌వ‌రం, కృష్ణ‌ప‌ట్నం కంటే ఎక్కువ ఎగుమతి జ‌రుగుతూ వ‌చ్చింది. గ‌డిచిన మూడేళ్ల కాలంలో కోటీ31ల‌క్ష‌ల ట‌న్నుల ఎగుమ‌తి జ‌రిగింద‌ని ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రకటించారు. గ‌త మూడేళ్ల‌లో 45 వేల కోట్ల రూపాయ‌ల విలువైన బియ్యాన్ని కికానాడ పోర్టు ద్వారా త‌ర‌లించారు. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాను అరిక‌ట్టేందుకు ముందుకుసాగుతుంది. దీంతో ఈ మాఫియాలో భాగ‌స్వాములుగా ఉన్న వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కూట‌మి నేత‌లు లేవ‌నెత్తుత‌ున్న అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు విష‌యాన్ని తెరమీదకు వచ్చారు.  మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు. అంబ‌టి రాంబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం లేవ‌నెత్తిన అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని అర్థమౌతోంది. ఇదిలాఉంటే మ‌రోవైపు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా అంశంపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్నారు.  అయితే, ప‌వ‌న్ భేటీ ముగిసిన‌ త‌రువాత చంద్ర‌బాబుతో ఏపీ డీజీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు, ఇంటెలిజెన్స్ డీజీపీ మ‌హేశ్ చంద్ర ల‌డ్డా భేటీ అయ్యారు. కాకినాడ వేదిక‌గా రేష‌న్ బియ్యం దందాకు అడ్డుక‌ట్ట వేసే విష‌యంపై చ‌ర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో క‌మిటీవేసే ఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో  రేష‌న్ బియ్యం దందా వ్య‌వ‌హారం ఎప్పుడు ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.