చంద్రబాబు, లోకేష్.. ఒకరి తరువాత ఒకరు హస్తినకు.. అసలేం జరుగుతోంది?

Publish Date:Feb 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రానున్న రోజులలో అత్యంత కీలక పరిణామాలు సంభవించనున్నాయా. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగే దొంగ అని అరుస్తున్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఇందు కోసం కేంద్రం సహాయాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతోందా అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. 

ఇందుకు వారు చూపుతున్న కారణాలేంటంటే.. ఒక్క రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలను చూపుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈయన ఈ నెల 9న ఢిల్లీకి బయలుదేరి వెళ్లి, ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న హస్తినలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు పర్యటన సందర్భంగానే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే బుల్లెట్ కారిడార్ ల విషయంలో అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సరే చంద్రబాబు మంత్రులతో వరుస భేటీల తరువాత  అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ మరుసటి రోజే అంటే మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి లోకేష్ హస్తినకు చేరుకున్నారు.

అంటే చంద్రబాబు ఇలా రాగానే.. లోకేష్ అలా హస్తినలో అడుగు పెట్టారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకు ముందు  చంద్రబాబు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా చర్చించారు. ఇరువురి మధ్యా ముఖాముఖీగా జరిగిన ఈ చర్చల సారాంశంపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.  ఆ భేటీ పూర్తయిన గంటల వ్యవధిలోనే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   ఏపీ అసెంబ్లీ బడ్జెట్ మావేశాలరాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ మంత్రి లోకేష్ హస్తినలో మెరుపు పర్యటన జరపడం.. కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

సరిగ్గా దాదాపు ఇదే సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు తోడుగా, ఆ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో రానున్న రోజులలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక చర్యలకు ఆస్కారం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయిన తరువాత కూడా.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఉదాశీనంగా వ్యవహరించడంపై కూటమి శ్రేణుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండటం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక చర్యలకు శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమౌతున్నదనడానికి ఈ పర్యటనలు, భేటీలను విశ్లేషకులు సంకేతంగా చెబుతున్నారు.   అదే నిజమైతే వైసీపీ అగ్రనేతలకు రానున్న రోజులలో చుక్కలు కనిపించడం, కటకటాలు లెక్కించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.