జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఆ తరువాత మే 17న కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన జగన్ అభ్యర్థనను అంగీకరించవద్దని సీబీఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నాయనీ ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతించవద్దనీ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడివిట్ దాఖలు చేసింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో నేరుగా చెప్పకపోయినా.. ఆయన విదేశాలకు వెడితే తిరిగి వస్తారన్న నమ్మకం లేదని అర్ధం వచ్చేలాగే పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగానే తెలుగుదేశం కూటమి నేతలు జగన్ పలాయనానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సీబీఐ కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా కోర్టుకు తన అఫిడవిట్ లో అదే చెప్పింది.
మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందనీ, ఆ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు యథాప్రకారం వితండ వాదనే చేశారు. విదేశాలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, దానిని కాలరాయడమేంటని వాదించారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం కండీషనల్ బెయిలుపై ఉన్నారు. బెయిలు షరతుల్లో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్నది ఒకటి. అలాంటి సమయంలో విదేశీయానాన్ని అడ్డుకోవడం హక్కును కాలరాయడం అవుతుందని వాదించడం విచిత్రమేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఇరువైపు వాదనలూ విన్న మీదట కోర్టు తదుపరి విచారణను మే 14కు అంటే పోలింగ్ తరువాతి రోజుకు వాయిదా వేసింది. గతంలో జగన్ విదేశీయానానికి అనుమతి అడిగిన ఏ సందర్భంలోకూ కోర్టు వాయిదా వేయకుండా వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ సారి మాత్రం వాయిదా వేయడంతో జగన్ అభ్యర్థనను కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయా? లేవా అన్న చర్చ జోరందుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-pbjects-jagan-plea-to-foriegn-tout-in-cbi-25-175484.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.