బెడిసి కొట్టిన ప్లాన్‌.. జగన్ కు జైలు ఖాయం!?

Publish Date:May 9, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  వైసీపీ ఓట‌మి దాదాపు ఖాయ‌మైంది. జ‌గ‌న్, వైసీపీ అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. కూట‌మికే మా ఓటు అంటూ వైసీపీ అభ్య‌ర్ధుల ఎదుటే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తీ రెడ్డి ప్ర‌చార స‌మ‌యంలోనూ ఆమెకు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదురైంది. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌డం లేద‌ని, మ‌ళ్లీ వైసీపీకి మేమెందుకు ఓటు వేయాలంటూ భార‌తిని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెంట్ లో ఉద్యోగులు జ‌గ‌న్ కు బిగ్ షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అన్ని అంశాల‌ను బేరీజు వేసుకొని, ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల బ‌ట్టి ఓడిపోతున్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి దీంతో ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆయ‌న దేశం విడిచి వెళ్లిపోయావాల‌ని ప్లాన్ చేసుకున్నారు. జ‌గ‌న్‌పై అవినీతి కేసులు కోర్టులో న‌డుస్తున్నాయి. దీంతో కోర్టు అనుమ‌తి లేకుండా జ‌గ‌న్ దేశం విడిచి పోకూడ‌దు.  ఈ క్ర‌మంలో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే, జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును సీబీఐ కోరింది. దీంతో ఎన్నిక‌లు అయిపోగానే విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని అనుకున్న జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. 

ఏపీలో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, మే 17 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టును కోరారు. జ‌గ‌న్ కుమార్తెలు విదేశాల్లో ఉంటారు. వారితో క‌లిసి లండ‌న్‌, ఫ్రాన్స్‌, స్విట్జ‌ర్లాండ్ ల‌లో ప‌ర్య‌టించేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆ పిటిష‌న్ లో కోరారు. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐని కోర్టు ఆదేశించ‌గా.. సీబీఐ అధికారులు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును కోరారు. గ‌తంలో రెండుసార్లు కోర్టు అనుమ‌తితో జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లి వచ్చారు. అప్పుడు సీఎంగా ఉండ‌టంతో అనుకున్న స‌మ‌యానికి తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశాల‌కు వెళితే తిరిగి వ‌స్తారని గ్యారెంటీ లేద‌న్న వాద‌న‌ను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీంతో తీర్పును ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేసిన‌టువంటి దాదాపు 30కిపైగా డిశ్చార్జి పిటీష‌న్ల పై గ‌త నెల 30లోగా తీర్పు రావాల్సి ఉంది. అనూహ్యంగా న్యాయమూర్తి మార‌డంతో మ‌ళ్లీ మొద‌టి నుంచి విచారణ చేపట్టాల్సిన ప‌రిస్థితి. కానీ  మే15 నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌లు కేసుల విచార‌ణ ప్రారంభం కానుంది. మెయిన్ కేసుల విచార‌ణ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇండియాలోనే ఉండాలి.. కేసులు జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. వాయిదాలు కోరి కేసులు సాగ‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని సీబీఐ   స్ట్రాంగ్ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. 

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని, జ‌గ‌న్ విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని ఆరోపించారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియానూ వైర‌ల్ అయ్యాయి. దీంతో సీబీఐ సైతం అల‌ర్ట్ అయ్యింది. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గ‌తంలో రెండు సార్లు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అప్పుడు సీబీఐ కూడా పెద్ద‌గా అడ్డు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ విదేశాల‌కు వెళితే తిరిగి రాక‌పోవ‌చ్చున‌ని సీబీఐ భావిస్తోంది.   దీంతో కోర్టు దృష్టికి ఇదే విష‌యాన్ని తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మి బ‌ల‌ప‌డే కొద్దీ జ‌గ‌న్ కు ఉచ్చు బిగుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌గ‌న్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుండ‌గా.. జ‌గ‌న్ పై కేసుల్లో క‌ద‌లిక మొద‌లు కాబోతుంద‌న్న చర్చ సైతం మొదలైంది.   ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో జ‌గ‌న్ పై కేసుల‌న్నీ పూర్తిచేసి.. ఆయ‌న్ను జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడిన వారి వెనుక చంద్రబాబు కుట్ర ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం కామ‌న్‌. ప్ర‌స్తుతం కోర్టులో సీబీఐ వాద‌న‌ల విష‌యంలో చంద్ర‌బాబు కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు అన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఏ పార్టీ అయినా పోలింగ్ ప్ర‌క్రియ‌పై స‌మీక్ష చేసుకుంటుంది. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ స‌ర‌ళిపైనా, వైసీపీకి ఏమేర‌కు ఓటు శాతం న‌మోదైంద‌న్న విష‌యాల‌పై స‌మీక్ష‌లు చేయాల్సింది పోయి.. ఎన్నిక‌లు అయిపోయిన నాలుగురోజుల్లోనే విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవ‌టం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుక‌నే సీబీఐ జ‌గ‌న్‌ విదేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్ముందు కాలంలో అరెస్టు నుంచి త‌ప్పించుకునేదుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం దాదాపు ఖాయ‌మైంద‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి. 
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు  కాంగ్రెస్  పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు  నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్     నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. 
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వ‌స్తుంది? గెలిచే అభ్య‌ర్థులు ఎవ‌రు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌ ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రిలో నెల‌కొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి.. మ‌రోసారి సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారా..? చంద్ర‌బాబు సీఎం సీటును అదిరోహించ‌బోతున్నారా? ఓట‌ర్లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చారు..? అనే విష‌యాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లోనేకాదు, దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ నెల‌కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.