బెడిసి కొట్టిన ప్లాన్‌.. జగన్ కు జైలు ఖాయం!?

Publish Date:May 9, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో  వైసీపీ ఓట‌మి దాదాపు ఖాయ‌మైంది. జ‌గ‌న్, వైసీపీ అభ్య‌ర్థుల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. కూట‌మికే మా ఓటు అంటూ వైసీపీ అభ్య‌ర్ధుల ఎదుటే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తున్నారు. క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తీ రెడ్డి ప్ర‌చార స‌మ‌యంలోనూ ఆమెకు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదురైంది. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు త‌మ‌కు అంద‌డం లేద‌ని, మ‌ళ్లీ వైసీపీకి మేమెందుకు ఓటు వేయాలంటూ భార‌తిని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు ఏపీలో పోస్ట‌ల్ బ్యాలెంట్ లో ఉద్యోగులు జ‌గ‌న్ కు బిగ్ షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అన్ని అంశాల‌ను బేరీజు వేసుకొని, ప్ర‌ముఖ స‌ర్వేల ఫ‌లితాల బ‌ట్టి ఓడిపోతున్నామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలే చెబుతున్నాయి దీంతో ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆయ‌న దేశం విడిచి వెళ్లిపోయావాల‌ని ప్లాన్ చేసుకున్నారు. జ‌గ‌న్‌పై అవినీతి కేసులు కోర్టులో న‌డుస్తున్నాయి. దీంతో కోర్టు అనుమ‌తి లేకుండా జ‌గ‌న్ దేశం విడిచి పోకూడ‌దు.  ఈ క్ర‌మంలో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ దాఖలు చేశారు. అయితే, జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును సీబీఐ కోరింది. దీంతో ఎన్నిక‌లు అయిపోగానే విదేశాల‌కు వెళ్లిపోవాల‌ని అనుకున్న జ‌గ‌న్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. 

ఏపీలో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, మే 17 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ సీబీఐ కోర్టును కోరారు. జ‌గ‌న్ కుమార్తెలు విదేశాల్లో ఉంటారు. వారితో క‌లిసి లండ‌న్‌, ఫ్రాన్స్‌, స్విట్జ‌ర్లాండ్ ల‌లో ప‌ర్య‌టించేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆ పిటిష‌న్ లో కోరారు. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సీబీఐని కోర్టు ఆదేశించ‌గా.. సీబీఐ అధికారులు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును కోరారు. గ‌తంలో రెండుసార్లు కోర్టు అనుమ‌తితో జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లి వచ్చారు. అప్పుడు సీఎంగా ఉండ‌టంతో అనుకున్న స‌మ‌యానికి తిరిగి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌న విదేశాల‌కు వెళితే తిరిగి వ‌స్తారని గ్యారెంటీ లేద‌న్న వాద‌న‌ను కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. దీంతో తీర్పును ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేసిన‌టువంటి దాదాపు 30కిపైగా డిశ్చార్జి పిటీష‌న్ల పై గ‌త నెల 30లోగా తీర్పు రావాల్సి ఉంది. అనూహ్యంగా న్యాయమూర్తి మార‌డంతో మ‌ళ్లీ మొద‌టి నుంచి విచారణ చేపట్టాల్సిన ప‌రిస్థితి. కానీ  మే15 నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అస‌లు కేసుల విచార‌ణ ప్రారంభం కానుంది. మెయిన్ కేసుల విచార‌ణ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇండియాలోనే ఉండాలి.. కేసులు జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. వాయిదాలు కోరి కేసులు సాగ‌దీసే అవ‌కాశం ఉంటుంద‌ని సీబీఐ   స్ట్రాంగ్ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. 

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మైంద‌ని, జ‌గ‌న్ విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని ఆరోపించారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియానూ వైర‌ల్ అయ్యాయి. దీంతో సీబీఐ సైతం అల‌ర్ట్ అయ్యింది. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లేందుకు ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గ‌తంలో రెండు సార్లు జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్లిన స‌మ‌యంలో కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అప్పుడు సీబీఐ కూడా పెద్ద‌గా అడ్డు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ విదేశాల‌కు వెళితే తిరిగి రాక‌పోవ‌చ్చున‌ని సీబీఐ భావిస్తోంది.   దీంతో కోర్టు దృష్టికి ఇదే విష‌యాన్ని తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మి బ‌ల‌ప‌డే కొద్దీ జ‌గ‌న్ కు ఉచ్చు బిగుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌గ‌న్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుండ‌గా.. జ‌గ‌న్ పై కేసుల్లో క‌ద‌లిక మొద‌లు కాబోతుంద‌న్న చర్చ సైతం మొదలైంది.   ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో జ‌గ‌న్ పై కేసుల‌న్నీ పూర్తిచేసి.. ఆయ‌న్ను జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడిన వారి వెనుక చంద్రబాబు కుట్ర ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేయ‌డం కామ‌న్‌. ప్ర‌స్తుతం కోర్టులో సీబీఐ వాద‌న‌ల విష‌యంలో చంద్ర‌బాబు కుట్ర ఉంద‌ని వైసీపీ నేత‌లు అన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సాధార‌ణంగా ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఏ పార్టీ అయినా పోలింగ్ ప్ర‌క్రియ‌పై స‌మీక్ష చేసుకుంటుంది. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలింగ్ స‌ర‌ళిపైనా, వైసీపీకి ఏమేర‌కు ఓటు శాతం న‌మోదైంద‌న్న విష‌యాల‌పై స‌మీక్ష‌లు చేయాల్సింది పోయి.. ఎన్నిక‌లు అయిపోయిన నాలుగురోజుల్లోనే విదేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవ‌టం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుక‌నే సీబీఐ జ‌గ‌న్‌ విదేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి మున్ముందు కాలంలో అరెస్టు నుంచి త‌ప్పించుకునేదుకు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం దాదాపు ఖాయ‌మైంద‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

By
en-us Political News

  
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది
ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి...
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.