Publish Date:Feb 16, 2026
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయ సన్యాసం తీసేసుకున్నట్లేనా? ఉద్యోగం వీడి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తొలుత జనసేనలో చేరారు. అయితే సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ తన పనితీరుతో సామాన్యుల మన్ననలు, అభిమానం చూరగొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులలో సీబీఐ జేడీగా ఆయన దర్యాప్తు సాగించిన తీరు పట్ల అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా లంచాలు తీసుకున్న జడ్జిని కూడా పట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు.
ఆ తరువాత కారణాలేమైతేనేం.. ఆయన తన ఉన్నతోద్యోగాన్ని వీడి రాజకీయాలలోకి ప్రవేశించారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారంటూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలం అటూ ఇటూ అంటూ ఊగి చివరికి సొంత పార్టీ కూడా పెట్టారు. అయితే రాజకీయాలలో ఆయనకు సక్సెస్ దక్కలేదు. అది పక్కన పెడితే.. ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ మోసానికి గురై భారీగా నష్టపోయారు. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరారు. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది.
ఆయన మేఘా గ్రూపునకు చెందిన ఈవీ ట్రాన్స్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొలువులో చేరారు. 2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక పాలిటిక్స్ తో లాభం లేదన్న నిర్ణయం వచ్చి మళ్లీ ఉద్యోగిగా కెరీర్ పై దృష్టి పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-former-joint-director-jd-lakshminarayana-joins-megha-group-25-214158.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.