కులం పేరు చెప్పుకొని...

Publish Date:Nov 5, 2013

Advertisement

 

అగ్రవర్ణస్తులు రాష్ట్ర విభజన జరిగితే తమ పెత్తనం పోతుందనే భయంతోనే విభజనను వ్యతిరేఖిస్తున్నారని కాంగ్రెస్ యంపీ మధుయాష్కీ ఒక సరికొత్త సిద్దాంతం ప్రతిపాదించారు. దానికి సదరు నేతలు అంగీకరిస్తారో లేదో కానీ, రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా ఈ సమస్య ఉంటుందని తెలంగాణా నేతలు ఇప్పటికే గ్రహించారు. అందుకే వారు ఇప్పుడు సామాజిక తెలంగాణా, ఆత్మగౌరవం వంటి పదాలు తరచూ వల్లె వేస్తున్నారు.

 

వారి ఆవేదన, ఆక్రోశం అర్ధం చేసుకోదగ్గదే. కానీ, వారి బాధ తమ కులస్తులందరికీ అన్యాయం జరుగుతోందని కాదు. కేవలం తమకి అన్యాయం జరుగుతోందని మాత్రమే. తమకు రాజకీయంగా అన్యాయం జరిగినట్లయితే, అది తమ కులస్తులందరికీ అన్యాయంగా మాట్లాడుతారు. తమకు అధికారం, పదవులు దక్కితే తమ కులస్తులందరికీ న్యాయం జరిగినట్లు ప్రజలని భావించమంటారు. దానివల్ల సదరు కులానికి చెందినా ప్రజలకి ఏవిధంగా లాభమో వారే చెప్పాలి.

 

సదరు వెనుకబడిన కులాలకు చెందిన రాజకీయ నేతలు పదవులు, అధికారం, డబ్బుఅన్నీ ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్నప్పటికీ, కుల ప్రాతిపదికన తమకు రాజకీయ న్యాయం జరగాలని ఆశించడం రాజకీయాలలో రిజర్వేషన్స్ వంటివే. అయితే ఆ రిజర్వేషన్స్ వారి కులస్తులందరికీ కాక కేవలం తమకి, తమ కొడుకులకి మాత్రమే వర్తించాలని వారి ఆరాటం. తమ స్థానంలోకి తమ సంతతికి తప్ప వేరెవరికీ ప్రవేశించే హక్కు ఉండదని వారి దృడ నమ్మకం.

 

అందుకే ఒక రాజకీయ నేత రాజకీయాలను తప్పుకొనకముందే తన స్థానంలోకి తన కొడుకుని కూర్చోబెట్టి మరీ తప్పుకొంటాడు. మన రాజకీయపార్టీలు కూడా, వారి కొడుకులకి, వారి మనుమలకే టికెట్స్, పదవులు ఇస్తూ తాము అన్ని కులాలవారికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతూ ప్రజలని మభ్యపెడుతున్నాయి.

 

అయితే ఇటువంటి స్వార్ధ రాజకీయ నేతలు ఏ కులానికి చెందినవారయినా వారి వల్ల సదరు కులస్తులకి ఎటువంటి ప్రయోజనమూ, ఉపకారము ఉండదు. నిజం చెప్పాలంటే అటువంటి నేతలు ‘స్వార్ధ కులానికి’ చెందిన నేతలగానే ప్రజలు పరిగణించాలి. రాజకీయంగా పైకి ఎదిగిన తరువాత కూడా తాము ఇంకా ఇంకా పైకి ఎదగాలని అనుకొంటారే తప్ప, కటిక దరిద్రం అనుభవిస్తున్న తమ కులస్థుల జీవితాలలో వెలుగులు నింపే ఎటువంటి ప్రయత్నాలు చేయరు. తమ కులస్తులు రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ, విద్యా,ఉద్యోగపరంగా గానీ పైకి ఎదిగేందుకు సదరు నేతలు ఎటువంటి సహాయసహకారాలు అందించరు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు, కనీసం చిత్తశుద్ధితో తమ కర్తవ్యం నిర్వహించి, తమ నియోజక వర్గాల అభివృద్ధి చేయాగలిగినా నేడు మన రాష్ట్రం, దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఈ కుల ప్రస్తావనలు ఉండేవి కావు. రాష్ట్ర విభజన ప్రస్తావన మొదలయినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు తమ కర్తవ్యం పక్కనపెట్టి, ఉద్యమాలు, ఆందోళనలు, సభలు, సమావేశాలు చేసుకొంటూ, డిల్లీ పర్యటనలు చేస్తూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటే వారిని ప్రశ్నించే నాధుడు లేడు.

 

స్వార్ధమే కులంగా ఎదిగిన నేతలు, ప్రజాప్రతినిధులు, నేటికీ తమ కులం పేరు చెప్పుకొని రాజకీయంగా మరింత ఎదగాలని ప్రయత్నిస్తుంటే, వారికి పదవులు, అధికారం దక్కకపోతే ప్రజలు తమకే అన్యాయం జరిగిందని భావించడం విచారకరం.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.