బదిలీతో సరి.. అంతేనా?

Publish Date:Mar 25, 2025

Advertisement

చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం.  ఇది ఎప్పటినుంచో  జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును  రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల  దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు. ఇప్పడు, ఆ వ్యవస్థల జాబితాలో, న్యాయ వ్యవస్థ కూడా చేరిందా అంటే, ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ,అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తల, ఉదంతం కాదన లేని సాక్ష్యంగా నిలిచిందని అంటున్నారు. అలాగే, న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే అభిప్రాయానికి, జస్టిస్ యశ్వంత్‌వర్మ ఉదంతం మరింత బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అయితే, ఈ ఉదంతంతో సంబంధం లేకుండానే,అనేకమంది ప్రముఖులు న్యాయవ్యవస్థ విశ్వసనీయత విషయంలో చట్ట పరిధిలోనే సందేహాలు వ్యక్త పరిచారు. 

అందుకే న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతోందనే ఆవేదన, న్యాయవ్యవస్థ లోపలి నుంచే వ్యక్తమవుతోంది. అవును  ఎవరో కాదు  భారత మాజీ ప్రధాన మూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, ఇటీవల (మార్చి 23) చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్న గిల్లుతోందని  అన్నారు. ప్రజల మనసుల్లో నాటుకు పోయిన ఈ భావనను గుర్తించి, పరిష్కారం చూప వలసిన అవసరం ఉందని అన్నారు. 

జస్టిస్ ఎన్వీ రమణ ఈ వాఖ్యలు ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి చేసి ఉండకపోవచ్చును, కానీ ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికార నివాసంలో, ప్రమాద వశాత్తు బయటపడిన  నోట్ల కట్టల ఉదంతంతో కలిపి చూస్తే  జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్య  మరింతగా అలోచింప చేస్తోంది. నిజానికి ఇప్పుడే కాదు  గతంలోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూసిన సందర్భాలు లేక పోలేదు. అందుకే  రోజురోజుకూ  న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల విశ్వాసం సన్నగిల్లుతూ సమూలంగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాద దిశగా సాగుతోందనే   ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.  

నిజానికి  ఢిల్లీ హై కోర్టు న్యాయమూర్తి నివాసంలో దొరికినట్లు చెపుతున్న నోట్ల కట్టల ఉదంతం కంటే, ఇందుకు సంబంధించి, సర్వోన్నత న్యాయస్థానం సహా, ఇతరత్రా వినవస్తున్న వ్యాఖ్యలు, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. 

ముఖ్యంగా  అసలు ఏమి జరిగింది  అనే విషయంలో స్పష్టత లేక పోవడం మొదలు, ఒక న్యాయమూర్తి నివాసంలో అనుమానస్పద నగదు బయట పడిన తర్వాత ఆరేడు రోజుల పాటు ఎటు నుంచి ఎలాంటి  స్పందన లేక పోవడం సహజంగానే పలు అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని అంటున్నారు. అలాగే  న్యాయమూర్తి బదిలీతో’ కేసును క్లోజ్ చేస్తారా? అన్న సందేహాలు వ్యక్త మయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో  న్యాయం జరగడమే కాదు  జరిగినట్లు కనిపించాలి  అనే సహజ సహజ న్యాయ సూత్రం మరుగున పడిపోయిందని, అంటున్నారు. అందుకే  జస్టిస్ వర్మ ఉదంతం చివరకు ఎలా ముగుస్తుంది  అనేది ఆసక్తికరంగా మారింది.  అయితే సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించిన  తర్వాత  తుది ప్రకటన వెలువడనుందని ప్రకటించింది. అంటే కొలీజియం బంతిని,  ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. ఇక ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ఏమి చేస్తుంది? బదిలీతో సరి అంటుందా? చూడాలి. 

By
en-us Political News

  
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
ఈ కేసులో తాను టార్గెట్ అయ్యాన‌న్నారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు. జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
మద్యం కుంభకోణం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ, వారిని నిర్దోషులుగా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు. నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.