వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు.. కారణమేంటో తెలుసా?

Publish Date:Jul 7, 2025

Advertisement

అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు ఇప్పుడు బాగా తెలిసివస్తోంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి లెక్క చేసే పనే లేదంటూ ఇంత కాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు, క్యాడర్ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఏక కాలంలో వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు కూడా అందాయి. దీంతో ఏం చేయాలో తెలియకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతోంది.

ఇంతకీ అసలు ఒకే సారి ఇంత మందిపై కేసులు, నోటీసుల వెనుక కారణమేంటంటే.. జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల యాత్ర. జగన్ రెండపాళ్ల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్యపైనా, జగన్ ర్యాలీలో ఉండాల్సిన కార్ల సంఖ్యపైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే వైసీపీ ఆ ఆంక్షలు, ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వేల మందితో, వందల కార్లతో ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సంగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. దీనిపై పోలీసులు వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకు, పలువురు కీలక నేతలకు నోటీసలుు పంపి, వారిపై కేసులు నమోదు చేశారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన కేసు నడుస్తోంది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు.

ఇప్పుడు దానికి అదనంగా పోలీసుల అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడం, డీజే ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, దేవినేని అవినాష్, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవన్ సహా మొత్తం 113 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.  ఈ పరిణామంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైకి బింకంగా కోర్టులో తేల్చుకుంటామంటూ చెబుతున్నా.. క్యాడర్ లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పార్టీ వర్గాలు వర్రీ అవుతున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.