అసత్య ఆరోపణలు.. భూమనపై కేసు

Publish Date:Apr 18, 2025

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతి పై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో టీటీడీ తిరుపతి గోశాల గోవధ శాల గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. మూడు నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు.

అదే రోజు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భూమన ఆరోపణలు అవాస్తవమని ఖండిచారు. గోశాల పై అసత్య ప్రచారం మైనుకోవాలని,  నేరుగా వస్తే సాక్షాలతో నిరూపిస్తామన్నారు.  ఇక ఆ తరువాత రోజుకొక్క అంశంతో ప్రచారం, వాదోపవాదాలు, సవాళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా గోశాల పై అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోశాల పరిధిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్వీయూ పోలీసులు క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు నమోదు చేశారు.

దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ  టీటీడీ, అనుబంధట సంస్థ ల పై ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  భవిష్యత్తులో ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, టీటీడీ గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగ్గా పెట్టలేదు..  బక్కచిక్కి పోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి టీటీడీ ప్రతిష్ట ను దిగజార్చే విధంగా చేశారని అన్నారు. గో  హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ఆరోపణలు చేసిన   టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరినట్లు చెప్పారు. అదే ఫిర్యాదు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాననీ, దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. 

By
en-us Political News

  
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.