అరెస్టులతో భయపెట్టి యువగళాన్ని ఆపలేరు..లోకేష్

Publish Date:Sep 26, 2023

Advertisement

నాలుగేళ్ల పాలనలో జనం మెచ్చే ఒక్క పనీ చేయలేకపోయిన ముఖ్యమంత్రి జగన్.. వారు తనకు మరో చాన్స్ ఇవ్వరన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. మరి ఇప్పుడు వారి అవసరం లేకుండానే అధికారంలోకి రావడానికి అడ్డదారులు వెతుకుతున్నారు. జనం ఎవరినైతే మెచ్చి ఎవరి పర్యటనలకైతే తండోపతండాలుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారో వారిని కదలకుండా చేస్తే సగం గెలిచేసినట్లేనన్న భ్రమల్లో ఉన్నారు. అందుకే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారు.

ఏపీ సీఐడీ ఈ నాలుగేళ్లుగా జగన్ సొంత సంస్థగా మారి ఆయన ఏం చెబితే అది చేయడమే తన కర్తవ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ అడ్డగోలుగా  నిబంధనలను తుంగలో తొక్కి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న లోకేష్ నూ కటకటాల వెనక్కు నెట్టేందుకు చర్యలు ఆరంభించింది. అసలు జరగని పనికి, నిధులే వ్యయం కాని పనిలో అవినీతి జరిగిందంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసంటూ ఒకదానిని తెరపైకి తీసుకువచ్చి.. ఆ కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా  ఆగిన లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన అరెస్టునకూ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటున్నారు

కానీ... వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక మాత్రమే. ఇందు కోసం సెంటు భూమిని సేకరించలేదు. సమీకరించలేదు. ఇందు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదు. అయినా ప్రణాళిక రూపొందించడమే మహా నేరమన్నట్లుగా కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏ1గా, అప్పటి మంత్రి నారాయణను ఏ2గా చేర్చారు. ఇప్పుడు నారా లోకేష్ ను ఏ14గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ2 నారాయణ, మరి కొందరు కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే నారా చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ బెయిలు పిటిషన్ కూడా ధాఖలు చేయలేదు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై ఏసీబీ కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశాక, చంద్రబాబు ఈ కేసులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. 

సరే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ తనను ఏ14గా చేర్చడంపై స్పందించారు. ఓటమి భయంతో గజగజలాడుతున్న జగన్.. ప్రత్యర్థులందరినీ నిర్బంధించి.. ప్రజలను భయం గుప్పెట్టోని నెట్టేసి ఏదో విధంగా విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టగలన్న భ్రమల్లో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగసిపడుతోందని, అందులో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, విపక్షాలను నిర్బంధించి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించిన జగన్ కు ప్రజా కోర్టులో ఓటమి శిక్ష ఇప్పటికే ఖరారైందని లోకేష్ అన్నారు. 
తనను అరెస్టు చేసి యువగళాన్ని ఆపాలన్న జగన్ ప్రయత్నం ఫలించదన్నారు. జీవో 1 తీసుకువచ్చినా ఆగని యువగళం ఇప్పుడు సీఐడీ ఉడత ఊపులకు బెదురుతుందనుకోవడం భ్రమేనని పేర్కొన్నారు.    ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, తన యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.   

ఇక లోకేష్ ను ఏ14గా చేర్చిన ఇన్నర్ రింగు రోడ్డు కేసు విషయానికి వస్తే.. ఇన్నర్ రింగు రోడ్డు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం జరగలేదు. అటువంటి ఈ కేసులో ప్రజాధనం దుర్వినియోగం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పరిశీలకులు అంటున్నారు.  రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చి.. అస్మదీయులకు లాభం చేకూర్చరన్నది సీఐడీ అభియోగం.  అయితే అసలు ఇన్న రింగ్ రింగ్ అలైన్ మెంట్  ఖరారే కానప్పుడు అస్మదీయులకైనా, మరెవరికైనా ఎలాంటి ప్రయోజనం, లాభం సిద్ధించే అవకాశమే లేదు.  అలాంటి వ్యవహారంలో కేసు నమోదు చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేయడమంటే జగన్ సర్కార్ ఎంతగా బరితెగించేసిందో అర్థమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ కేసు ఎందుకు నమోదు చేశారంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారని సీఐడీ చెబుతోంది.  జగన్ సర్కార్ తీరుతో ఇప్పటికే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లింది.  ఇక వైసీపీ నేతలు బాహాటంగా చంద్రబాబుని అరెస్టు చేశాం. లోకేష్ నూ వదలం.. అచ్చెన్నాయుడు.. ఇంకా ఎవరైనా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తితే వారినీ అరెస్టు చేసేస్తాం అంటే బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారంటే.. ఎందగా బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

 అయినా అరాచకత్వం, అహంభావం, నియంతృత్వ ధోరణి జనం భయపడినంత కాలమే సాగుతాయనీ, చంద్రబాబు అరెస్టు అనంతరం వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలూ చూస్తుంటే జనం భయం వదిలేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను ఓటు ఆయుధంతో శిక్షించేందుకు జనం సిద్ధంగా ఉన్నారనీ, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చంద్రబాబుకు పట్టం గట్టి జగన్ ను ఇంటికి సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.