Publish Date:Apr 26, 2022
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ముందస్తుకు వెళ్లాలన్న యోచనలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అన్ని వర్గాలలో నెలకొన్న అసంతృప్తిని పరిగణనలోనికి తీసుకుని...గట్టెక్కాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే శరణ్యమన్న నిర్ణయానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వర్గాలలో జగన్ సర్కార్ పట్ల ఏదో ఒక స్థాయిలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. అయితే రానున్న రోజులలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులున్నా ‘ఉచిత’ పథకాలను కొనసాగిస్తున్నారు. అయితే రానున్న రోజులలో వీటిని కొనసాగించే అవకాశం ఏ మాత్రమూ లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారడం ఖాయమన్న భావన వైసీపీలోనే వ్యక్త మౌతున్నది. అందుకే ఈ పథకాలు కొనసాగించలేని పరిస్థితి వచ్చే లోగానే...అంటే ఈ పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లి గట్టేక్కాలని జగన్ భావిస్తున్నారు. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సంక్షేమానికి చాంపియన్ గా నిలిచానని ప్రచారం చేసుకోవడంతో పాటు మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలా కాకుండా పూర్తి కాలం అధికారంలో ఉండి...గడువు ప్రకారమే ఎన్నికలకు వెళ్లినట్లైతే...ఆప్పటి వరకూ పథకాలు కొనసాగించే అవకాశం ఉండదనీ, అందు వల్ల వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన ప్రభుత్వంగా ప్రజల ముందకు వెళ్లాల్సి వస్తుందని, అదే జరిగితే విఫల నేతగా జనం ముందుకు వెళ్లాల్సి వస్తుందనీ, అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. ఆ కారణంతోనే ముందస్తుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద మరో రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ జగన్ ముందస్తుకే మొగ్గు చూపడానికి కారణం ఉచిత పథకాలను కొనసాగించలేని దైన్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cant-continue-freebes-jagan-prefers-early-elections-39-134999.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!