ఫ్యాన్స్ కు పవన్ కళ్లెం వేయగలరా ?

Publish Date:Jan 27, 2025

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీ నేపథ్యం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని హీరో. అశేష ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. జనసేన క్యాడర్ లో అత్యధికులు కూడా సినీ అభిమానులగా మొదలై.. జనసైనికులుగా మారిన వారే. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎదురౌతున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే.. అత్యధిక జనసైనికులకు పొలిటికల్ కంపల్షన్ విషయంలో పట్టింపు ఉందడు. అలాగే పొత్త ధర్మం గురించి ఆలోచించి, అర్ధం చేసుకునేంత రాజకీయ పరిజ్ణానం కూడా ఉండదు. వారికి ఉన్నది పవన్ కల్యాణ్ పై హద్దులు లేని, అవధులు లేని అభిమానం మాత్రమే. వారి ఈ వైఖరే పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఒకింత ఇబ్బందికరంగా మారింది. 

అప్పటికీ పలు సందర్భాలలో  పార్టీ క్యాడర్ ను ముఖ్యంగా అభిమానులను నియంత్రించడానికి ఆయన ప్రయత్నించారు. ఒక్కోసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సినీమా వేరు, రాజకీయం వేరు అని నిష్కర్షగా, నిర్మొహమాటంగా ఒకింత ఘాటు స్వరంతోనే చెప్పారు. అయితే తరచూ జనసైనికుల వైఖరి పొత్తు ధర్మానికి భిన్నంగా ఉంటూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు కొన్ని గైడ్ లైన్స్ విధించారు. జనసేన స్వతంత్రంగా వ్యవహరించే పార్టీ అయినా తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించి తీరాలని ఆయన గట్టిగా చెప్పారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ కు డూస్ అండ్ డోంట్స్ ను స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన జనసైనికులనే కాకుండా, తెలుగుదేశం, బీజేపీ క్యాడర్ కు కూడా కనువిప్పు కలిగే లా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తన పార్టీ క్యాడర్ ను ఉద్దేశిస్తూ జారీ చేసిన మార్గదర్శకాల్లో గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని మరోసారి పూసగుచ్చినట్లు వివరించారు. జగన్ ను నియంత్రించి తీరాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే జనసేన పార్టీ చొరవ తీసుకుని తెలుగుదేశం, బీజేపీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు కారణమైందని వివరించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, క్యాడర్ కూడా కొన్ని త్యాగాలు చేశాయని అంగీకరించారు. అలా చేయడం వల్లనే జనసేన గత ఏడాది జరిగిన ఎన్నికలలో హండ్రడ్ పర్సంట్ రిజల్డ్ సాధించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.   ఇంతటి  భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జనసైనికులు సంయమనంతో వ్యవహరించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు జనసైనికులకు ఆయన జారీ చేసిన మార్గదర్శకాల విషయానికి వస్తే...

1. అనవసర విభేదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. 2జ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించ కూడదు. 3. కూటమి అంతర్గత విషయాలు, వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడకూడదు.   వెరసి కూటమి పటిష్టతకు హానీ చేసే ఏ ఒక్క విషయంపై అసలు స్పందించవద్దని ఆయన పార్టీ శ్రుేణులను కోరారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ కట్టుబాట్లకు కట్టుబడాల్సిందేనని కూడా పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు.

అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. జనసేనాని ఇప్పుడు తన క్యాడర్ కు విధించిన మార్గదర్శక సూత్రాలు కొత్తవేమీ కాదు. గతంలో ఆయనే స్వయంగా ఈ విషయాలను ప్రస్తావిస్తూ తన క్యాడర్ కు అభిమానులను పలు సందర్భాలలో హెచ్చరించారు. కానీ ఫలితం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ పార్టీ క్యాడర్ కు మార్గదర్శకాలు జారీ చేశారు. పొలిటికల్ గా ఆయన చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యం. అయితే రాజకీయ అవసరాలు, ఒత్తిళ్ల గురించి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోరు. వారి ఏకైక ఆకాంక్ష పవన్ కూటమిలోనైనా, ప్రభుత్వంలోనైనా నంబర్ వన్ గా ఉండాలన్నదే. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో వారు ఆర్భాటంగా చాటారు. ఆయన సభలలో సీఎం నినాదాలు, తెలుగుదేశం పార్టీలో, లేదా కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు ప్రమోషన్ అన్న వార్తలకు వారు అతిగా స్పందించడంలాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో జనసేనాని మార్గదర్శకాలను జనసైనికులు పాటిస్తారా? వారిని పవన్ కల్యాణ్ కంట్రోల్ చేయగలరా? అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.