జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనాన్నివ్యయం చేసి నిర్మించిన అత్యంత విలాలవంతమైన, అంతకు మించి వివాదాస్పదమైన రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఉత్కంఠకు తెరపడిందా? ఈ విలాసవంతమైన భవనాన్ని ప్రస్తత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించనుందా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి, పర్యావరణ సమతుల్యతకు భగం వాటిల్లేలా పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది.
ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో రూ. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్స్ ద్వారా ప్రభఉత్వానికి 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. కానీ వాటిని కూల్చివేసి ఈ ప్యాలెస్ను నిర్మించడంతో ఆ ఆదాయం లేకుండా పోవడమే కాకుండా.. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ వ్యయమే నెలకు పాతిక లక్షల రూపాయలకు పెగా ఉంది.
ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ హోటల్ చైన్స్కు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలుఈ దిశగా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా ప్రపంచస్థాయి రిసార్ట్స్గా మార్చడం ద్వారా అటు పర్యాటకాన్ని అభివృద్ధితో పాటు, ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కమిటీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా భేటీలో కమిటీ చర్చించిన విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో సమర్పించాలని కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-subcommittee-onrushikonda-palace-to-submitt-reoprt-36-216855.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.