మా పార్టీకి అంత సీన్ లేదు: రామచంద్రయ్య

Publish Date:Feb 27, 2013

Advertisement

 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలోకలిపేసి, రాష్ట్ర దేవాదాయ మంత్రి పదవితో పునీతం అయిన తరువాత కూడా, కాంగ్రెస్ పార్టీ తమతో ఇంకా ‘మైల’పాటిస్తూ దూరంగా ఉంచుతోందని మంత్రి సి.రామచంద్రయ్యగారు అప్పుడప్పుడు ఆరోపిస్తుంటారు. చిరంజీవి చొరవతో కిరణ్ కుమార్ రెడ్డి తనకో మంత్రి పదవి పడేసినంత మాత్రాన్న తనకు కొత్తగా పెరిగిన గౌరవం ఏమి లేదని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన తరువాత కూడా తనకు, తన అనుచరులకు పార్టీలో తగినంత ప్రాధాన్యం ఈయట్లేదనే బాధ కూడా ఆయనలో ఉంది. అది అప్పుడప్పుడు అయన మాటలలో బయటపడుతుంటుంది.

 

మొన్న జరిగిన సహకార ఎన్నికలలో, తనను తన అనుచరులను పులుసులో కరివేపాకులా పక్కన పడేసి, అంతా తానయి చక్కబెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి పట్ల రామచంద్రుల వారికి కొంచెం ఆగ్రహం కలగడం సహజమే. అందుకే, ఈ సహకార ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ‘టముకు’ వేసుకొంటున్న ఘన విజయమేమి తమ పార్టీ సాధించలేదని, అందువల్ల మరీ అంత సంతోషపడి ఉప్పొంగిపోవలసిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిఉంటే ఇంతకంటే ఘన విజయం ‘నిజంగానే’ సాదించగలిగేవాళ్ళమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఈ విషయంలో ప్రతిపక్షాలవారు దెప్పడం మరిచిపోయినా, ఆయన క్యాబినెట్ సహచరుడయిన సి.రామచంద్రయ్య శ్రమనుకోకుండా కిరణ్ నెత్తిన నాలుగు అక్షింతలు వేసి ఉన్న మాటను నలుగురికీ తెలియజెప్పారు.


By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ నూత‌న‌ డీజీపీగా హ‌రీశ్ కుమార్ గ‌ప్తాను ఎన్నిక‌ల సంఘం నియ‌మించింది. ఆయన సోమవారం (మే6) బాధ్యతలు చేపట్టారు. ఏపీ డీజీపీగా కొన‌సాగుతున్న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ఎన్నిక‌ల సంఘం ఆదివారం బ‌దిలీ వేటు వేసిన విష‌యం తెలిసిందే.
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.