ఓడిన కేజ్రీకి, గెలిచిన దీదీకి… ఇద్దరికీ తప్పని బీజేపి టెన్షన్!

Publish Date:Apr 13, 2017

Advertisement

 

ప్రతిపక్షాల గుండెల్లో కమలం కలకలం రేగుతూనే వుంది. 2014లో మోదీ ప్రధాని అవ్వటంతో మొదలైన ప్రభంజనం ఇంకా నడుస్తోంది. మొన్నటికి మొన్న యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ వశపరుచుకున్న బీజేపి ఇవాళ్ల ఉప ఎన్నికల్లో కూడా ఉత్సాహం ప్రదర్శించింది. అయితే, సాధారణంగా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికార పార్టీ హంగామా వుండటం మామూలే! కాని, ఇవాళ్ల కౌంటింగ్ జరిగిన వివిధ రాష్ట్రాల్లోని తొమ్మది స్థానాల్లో బీజేపి అత్యధిక సీట్లు గెలుచుకుని విమర్శకులకి ఒక విధంగా ఫ్యూచర్ చూపించేసింది!

 

బై ఎలక్షన్స్ పెద్దగా ట్రెండ్ ని గాని, భవిష్యత్ లో జరగబోయే పరిణామాల్ని పట్టిచూపలేవని రాజకీయ పండితులు అంటూ వుంటారు. అందుక్కారణం చాలా చోట్ల ఏ పార్టీ సీటు ఖాళీ చేస్తే అదే పార్టీ మళ్లీ గెలవటం. కాని, ఇవాళ్ల ఎన్నికల ఫలితాల్లో అలా జరిగింది కేవలం కర్ణాటకలోనే! అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కాంగ్రెస్సే గెలిచింది! దీని కారణంగా మరికొన్ని నెలల్లో అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అద్బుతం చేస్తుందంటే మాత్రం ఎక్స్ పర్ట్స్ ఒప్పుకోవటం లేదు!

 

ఇక మధ్యప్రదేశ్, అసోమ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపి అవలీలగా తన స్థానాలన్నీ తిరిగి కైవసం చేసుకుంది. మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ అమిత్ షా సైన్యం ఆల్రెడీ వున్న సీటు కోల్పోలేదు. అయితే, ఆశ్చర్యకరంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాషాయ దళం కాక పుట్టించింది. రాజౌరి గార్డెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపి విజయ దుందుభి మోగించింది! ఈ స్థానం ఇంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోనిది! కాని, బై పోల్స్ లో ఆప్ తన స్థానాన్ని నిలబెట్టుకోటం మాట అటుంచీ … అసలు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది! రెండో స్థానం కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ కి కట్టబెట్టారు!

 

ఢిల్లీ తరువాత ఈ రోజు ఉప ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా సాగిన పరిణామాలు బెంగాల్లో చూడొచ్చు! ఇక్కడ బీజేపికి విజయం దక్కలేదు. కాని, కాంతి దక్షిణ్ అనే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీఎంసీ బలమైన మెజార్జీతో గెలుచుకుంది. అయితే, రెండో స్థానంలో కమలదళం నిలవటం… దీదీకి టెన్షన్ పుట్టించే విషయం! ఒకప్పుడు ఈ నియోజకవర్గం సీపీఐ కంచుకోట! కాని, ప్రస్తుతం టీఎంసీ చేతిలోకి వెళ్లింది. కాని, రాష్ట్ర వ్యాప్తంగా అంతటా జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా బీజేపి వేగంగా ఎదుగుతోంది. ఈ ఉప ఎన్నికలతో మమతా బెనర్జీ రాబోయే ఎలక్షన్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది! కమ్యూనిస్టుల కన్నా కాషాయదళమే మమత గండంగా మారుతోంది!

 

బెంగాల్ లో బీజేపి యువనేత ఈ మధ్యే మమతా బెనర్జీ తలకు పదకొండు లక్షల వెలకట్టాడు! అంతకు ముందు కూడా శ్రీరామనవమి, సరస్వతీ పూజ వంటి వాటి విషయంలో బీజీపీ, టీఎంసీలకే గొడవ జరుగుతూ వస్తోంది! సీపీఎం, సీపీఐ లాంటి కమ్యూనిస్టు పార్టీలు అంతకంతకూ గేమ్ లో లేకుండా పోతున్నాయి! ఈ ఉప ఎన్నికల్లో బీజేపి రెండో్ స్థానానికి ఎగబాకటం ఎర్ర పార్టీల వారికి డేంజర్ సైరనే! వారి సంగతేమోగాని.. బెంగాల్లో కమలం రేపనున్న కలకలాన్ని బెనర్జీ మాత్రం  గుర్తించేసింది!

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.