పులివెందులకు ఉప ఎన్నిక.. తెలుగుదేశం అభ్యర్థి రెడీ?

Publish Date:Sep 8, 2025

Advertisement

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగం జరిగింది.. అంటే వైసీపీ ఎంతగా బుకాయించినా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోవడం ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కు కానీ ఇప్పట్లో సాధ్యం కాదన్నది వాస్తవం. అయితే ఆ పరాజయం స్వయంకృతాపరాధమేనని కూడా చెప్పక తప్పదు. గత ఏడాది జరిగగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ లో రాజకీయ శూన్యత నెలకొన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అవకాశం లేని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ జగన్ అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  జగన్ అసెంబ్లీకి హాజరై సామాన్య ఎమ్మెల్యేగా కూర్చోవలసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అవకాశం లేదని తెలిసీ ఆయన విపక్ష హోదా పేరు చెప్పి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నారు. ప్రజలు జగన్ ను పులివెందుల నియోజకవవర్గానికి తమ ప్రతినిథిగా ఓట్లేసి గెలిపించారు. రాజ్యాంగం ప్రకారం ఆయన అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను లేవనెత్తడం ఆయన విధి. బాధ్యత. అయితే వ్యక్తిగత అహం, ఆభిజాత్యంతో జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అయితే పైకి మాత్రం ప్రతిపక్ష హోదా అంటూ.. ప్రభుత్వం ఆ హోదా తనకు ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల సానుభూతి పొందాలని ప్రాకులా డుతున్నారు. సంఖ్యాబలం లేకుండా, హోదా లేకుండా సభకు వెడితే పరాభవంఎదురౌతుందన్న భయంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. అంతే కానీ..వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే సభకు హాజరై తనను ఎన్నుకున్న ప్రజల తరఫున గొంతు వినిపించాల్సిన కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ తీరు కారణంగానే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం రుజువుచేసింది. వాస్తవానికి జగన్ అసెంబ్లీ గైర్హాజర్ నిర్ణయం ఆయన అవకాశవాదాన్నీ, బాధ్యతను స్వీకరించలేని దుర్బలత్వానికీ నిదర్శనంగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఉప ఎన్నికల భయం వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను వణికించేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ భయం వణుకుతోనే, ఆ డిస్పరేషన్ తోనే వైసీపీ నేతలు గతంలో చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన నాడు అసెంబ్లీ బహిష్కరణ ప్రకటన చేసిన సందర్భం, సమయం పూర్తిగా వేరు. అయితే ఇప్పుడు జగన్, ఆయన పార్టీ సభ్యుల బహిష్కరణకు ఒక కారణం, ఒక విధానం, ఒక ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా నిరాశ, నిస్ఫృహ మాత్రమే.  విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజర్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  ఈ సారి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పులివెందులకు సపోజ్ ఫర్ సపోజ్ ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం అభ్యర్థిని రెడీ చేసేసిందంటున్నారు. . అంటే వైసీపీ బాధ్యతల నుంచి పారిపోయి దాక్కోవాలని ప్రయత్నిస్తుంటే.. తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమౌతోందని అవగతమౌతోంది.  

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.