బ్యూరోక్రాట్లు.. రాజకీయాల్లో ఫెయిల్యూర్లు!?

Publish Date:Feb 16, 2026

Advertisement

భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి  ఎలక్టెడ్, రెండవది ఎంపిక (సెలెక్టెడ్).  ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు ఎలెక్టెడ్ వర్గంలోకి వస్తారు.  ఉన్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు సెలెక్టెడ్ వర్గంలో ఉంటారు.   రాజకీయాలలో ముగిని తేలే   రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు.  కానీ  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాలలోకి రావడానికి ఎటువంటి ఆంక్షలూ లేవు.

అయితే వారు రాజకీయాలలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటేఉద్యోగంవదిలేయాలి. అందుకే చాలా మంది సివిల్ సర్వెంట్లు.. తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి  ఉద్యోగ విరమణ తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రం సర్వీసు ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పొలిటికల్ ఎరీనాలో అడుగుపెట్టిన వారూ ఉన్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు. రాణించగలుగుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల   బ్యూరోక్రాట్లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా    ఎవీఎస్ రెడ్డి పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  సర్వీసులో ఉండగానే  ఆయన తన పొలిటికల్ పార్టీని  ప్రకటించడం అప్పట్లో ఆందరినీ విస్మయానికి గురి చేసింది.  అయితే ఉద్యోగానికి విరామం ప్రకటించి  పార్టీని  ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి తిరగి ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యే వరకూ అందులోనే కొనసాగారు. ఇక ఆ తరువాత డాక్టర్ జయప్రకాశ్  నారాయణ్,  వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఇలా పలువురు బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కుంటున్నారు.  

వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  విజయ సాధించారు.  వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి,  ఆ తరువాత  గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. అలాగే  రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ కూడా మంత్రిగా చేశారు. అలాగే  తోట చంద్రశేఖర్ , ప్రవీణ్ కుమార్ లు కూడా  బ్యూరోక్రాట్ ల నుంచి పొలిటీషియన్ అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 

రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లు రాజకీయాలవైపు మళ్లడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రాజకీయాలలో మనుగడ సాగించడానికి కావలసిన వనరుల సేకరణలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఉండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం కూడా వారు రాజకీయాలలో రాణించలేకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.  ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయనా వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదొర్కొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ తరువాత ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.  ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది బ్యూరోక్రాట్లు రాజకీయాలను రిటైర్మెంట్ అనంతర వ్యవహారంగా రాజకీయాలను చూడటం వల్ల వారికి ప్రజలలో పెద్దగా గుర్తింపు రాలేదు అది వేరే సంగతి కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు. 

  ఇక విధినిర్వహణలో నిజాయితీ పరుడైన అధికారిగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా నిజాయితీకి ప్రతిఫలంగా ట్రాన్స్ ఫర్లు వస్తుండటంతో ప్రజా సేవే బెటర్ అని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దూకేశారు. జనసేన పార్టీలో చేరి,  2019లో విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసి సొంతంగా జై భారత్ పేరుతో పార్టీ పెట్టారు. జనసేనాని సినిమాలలో నటించడాన్ని కారణంగా చూపుతూ.. పవన్ కల్యాణ్ ని సీరియస్ పొలిటీషియన్ కాదని భావించి బయటకు వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. సరే సొంతంగా  జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. అది కూడా బిగ్ ఫెయిల్యూర్ గా మారింది. దీంతో రాజకీయాలు తన వంటికి సరిపడవని గ్రహించిన జేడీ ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరిపోయారు. అయితే.. గతంలో జనసేనానిని సీరియస్ పొలిటీషియన్ అని విమర్శించిన లక్ష్మీనారాయణను ఇప్పుడు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా పాలిటిక్స్ లోకి వచ్చిన బ్యూరోక్రాట్ లు పెద్దగా రాణించలేదనే చెప్పాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.