Publish Date:Jul 22, 2022
రాజకీయనాయకులకు, సినీస్టార్స్కు వారి పనులే కాకుండా బట్టల దుకాణాలు, మాల్స్ ఓపినింగ్ పని కూడా గొప్ప ప్రతిష్టా త్మకం. వారి వీరాభిమానులకు అదో పండగానందం! వీలయితే ప్రతీ గల్లీలోని పెద్ద పెద్ద దుకాణాల ఓపినింగ్ వారి చేత చేయిం చాలన్న పిచ్చి అభిమానంతో పిలుస్తుంటారు. ఏ ప్రాంతంలోనైనా సరే కొన్ని కేవలం శిలాఫలకంతోనే పనులు ఆగిపోతుంటాయి. ఓపినింగ్కి వెళ్లినవారు ఆ తర్వాత పెద్దా సీరియస్గా తీసుకోరు. అయితే ప్రజలు తమకు ఉపయోగపడేవాటిని నాయకులతో ఆరంభించాలనుకుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో అది అంత త్వరగా అనుకున్న సమయానికి అవ్వదు. ఉదాహరణకి కర్ణాటక గడగ్ జిల్లాలో ఒక బస్షెల్టర్ను ఆరంభించడానికి చాలారోజుల నుంచి అక్కడి రాజకీయనాయకులు ఎగనామం కొడుతున్నారు. ప్రజలు ఎదురు చూసి చూసి విసిగెత్తారు. చివరికి గేదె ను ఛీఫ్ గెస్ట్గా తీసుకువచ్చి మరీ ఆరంభించారు.
గడగ్ జిల్లా బాలసూర్లో ఒక బస్ షెల్టర్ కట్టి చాలా కాలమే అయింది. అంటే ఓ నలభయ్యేళ్లు! కొంతకాలం క్రితం అది కూలడం కూడా జరిగింది. కానీ దాని ఆరంభోత్సవం మాత్రం జరగలేదు. ప్రజలు దాన్ని వినియోగించడం కుదరలేదు. చాలాకాలం నుంచి అధికారులను ఆ బస్షెల్టర్ గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ అసలు ఆరంభోత్సవం జరగకుండా ఎలా ఉపయోగిస్తారని వారి సమాధానం. జనం విసిగెత్తారు, కోపం వచ్చింది. నాయకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి మండిపడ్డారు. పైగా బస్ షెల్టర్ అందుబాటులో లేకపోయేసరికి విద్యార్ధులు, ఉద్యోగులు అందరూ అక్కడి ఇళ్ల దగ్గర, దుకాణాల దగ్గర బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వర్షాకాలం పరిస్థితులు మరీ దారుణంగా మారతాయి. ఇక లాభంలేదని ఆమధ్య అక్కడివారే బస్ షల్టర్ను ఆరంభించారు. అయితే అందుకు ఛీఫ్ గెస్ట్గా మాత్రం ఒక గేదెను తీసుకువచ్చారు. దీని సారాంశమేమిటో మరీ వివరిం చక్కర్లేదేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/buffalo-as-chief-guest-25-140333.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!