చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు

Publish Date:Feb 28, 2013

Advertisement

 

 

 

 

కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఎన్నో ఆటంకాలను సమర్ధవంతంగానే ఎదుర్కొంటూ దేశ యువతకు ఆశాజనకమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రజలకు ఏం కావాలి అంటే సమాజంలో ఎదుగుదలకు అవకాశాలు, విద్య, నిపుణత, ఉపాధి అవకాశాలు. వీటి ఆవశ్యకత దేశంలో యువతకు బాగా తెలుసు, ప్రతి తల్లికీ తెలుసు. వారికి విస్తృతావకాశాలు కల్పించడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాలన, విత్త యాజమాన్యం రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించినట్టు మంత్రి చెప్పారు.

 

చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు:

 

- ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.41,561 కోట్లు
- ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.24,598 కోట్లు
- మహిళా సంక్షేమానికి రూ.200 కోట్లు
- వికలాంగుల పథకానికి రూ.110 కోట్లు.
- వైద్య శాఖకు రూ.37,330 కోట్లు
- చిన్నారులకు రూ.76,200 కోట్లు
- వైద్య విద్యా శిక్షణ కోసం రూ.4727 కోట్లు
- ఆయూష్‌కు రూ.1069 కోట్లు
- విద్యాశాఖకు రూ.65,857 కోట్లు.
- సర్వశిక్ష అభియాన్‌కు రూ.27,368 కోట్లు.
- స్కాలర్‌షిప్‌లకు రూ.5,284 కోట్లు.
- మధ్యాహ్న బోజనం రూ.13,837 కోట్లు
- మహిళలు, శిశివు పోషకాహార పథకానికి రూ.300 కోట్లు, 100 నుంచి 200 జిల్లాలకు ఈ పథకం విస్తరణ
- గ్రామీణాభివృద్ధికి రూ.80,195 కోట్లు.
- ఇందిరా ఆవాస్ యోజన కోసం రూ.15,184 కోట్లు.
- తాగునీటి, పారిశుధ్యానికి రూ.15,260 కోట్లు.
- ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి రూ.1400 కోట్లు
- గ్రామీణ సడక్ యోజన రెండో ధఫా ప్రారంభిస్తాం.
- 12వ ప్రణాళికలో నగరాభివృద్ధి పథకం కొనసాగింపు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 250 మినియన్ టన్నుల పైనే.
- రవాణా శాఖకు అదనంగా 10 వేల బస్సులు.
- రవాణా శాఖకు రూ.14,873 కోట్లు
- వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.27,049 కోట్లు.
- వాటర్ షెడ్ల నిర్వహణకు రూ.5,387 కోట్లు.
- ఎస్సీ,ఎస్టీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.5,284 కోట్లు.
- మైనార్టీ సంక్షేమానికి రూ.3,511 కోట్లు.
- ఉపాధి పనులకు రూ.70 వేల కోట్లు.
- ఉపకార వేతనాలకు రూ.5,284 కోట్లు.
- రూ. 7లక్షల కోట్ల మేర పంట రుణాలు, సకాలంలో రుణాలు చెలించే రైతులకు రాయితీ.
- ఆహార భద్రత పథకానికి అదనంగా రూ.10 వేల కోట్లు.
- పంట మార్పిడికి ప్రోత్సాహం.
- మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం కొత్త పథకాలు.
- 2013-14 బడ్జెట్ రూ16,65,282 కోట్లు.
- ఈ ఏడాది ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు.
- ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో మేజర్ ఓడరేవులు.
- ఎయిమ్స్ తరహా ఆరు వైద్య సంస్థలు.
- పంట శీతలీకరణ గోదాముల కోసం రూ.500 కోట్లు.
- తొలిసారి రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి లక్ష వడ్డీ తగ్గింపు.
- బొగ్గు ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రాధాన్యం
- బొగ్గు దిగుమతులు తగ్గించడం ప్రాధాన్యం.
- చిన్న తరహా పరిశ్రమలకు మూడున్నరేల్ల పన్ను రాయితీ.
- చెన్నై - బెంగుళూరు మధ్య పారిశ్రామిక కారిడార్.
- త్వరలో రోడ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు.
- మరమగ్గుల ఆధనికీకరణకు రూ.2400 కోట్లు.
- జౌళి పరిశ్రమలో కాలుష్య నియంత్రీకరణకు రూ.500 కోట్లు.
- 12వ ప్రణాళికలో ఖాది పరిశ్రమకు రూ.850 కోట్లు.
-  వ్యవసాయ పరిశోధనకు రూ.3145 కోట్లు.
- 13 జాతీయ బ్యాంకులకు రూ.12,570 కోట్ల అదనపు పెట్టుబడి. ప్రతి బ్యాంకుకు ఏటీఎమ్ తప్పనిసరి.
- ప్రభుత్వ రంగంలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు.
- మహిళా బ్యాంకుకు వెయ్యి కోట్లు మూలధనం. రుణ పరపతికి వీలుగా జాతీయ మహిళా బ్యాంకు.
- వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత భీమా పథకాలు.
- టెక్స్‌టైల్స్ పార్కులకు రూ.50 వేల కోట్లు.
- 10 వేల జనాభా దాటిన గ్రామంలో జాతీయ బ్యాంకు, ఎల్ఐసీ కార్యాలయాల ఏర్పాటు.
- త్వరలో సెబీ చట్ట సరవరణకు చర్యలు.
- అంగన్‌వాడీ వర్కర్లకు గ్రూప్ భీమా పథకాలు.
- పవన విద్యుత్‌కు రూ.800 కోట్లు.
- ఆరు శాతం వడ్డీతో చేనేత మహిళలకు రుణాలు.
- రక్షణ రంగానికి రూ.2,03,670 కోట్లు.
- సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6 వేల కోట్లు.
- పాటియాలాలో జాతీయ క్రీడా శిక్షణ సంస్థ.
- లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోలు. ఈ ఆర్థిక ప్రణాళికలో 800 పైగా ఎఫ్ఎమ్ స్టేషన్లు.
- పోస్టాఫీస్ బ్యాంకింగ్ కోసం రూ.532 కోట్లు.
- మహిళా భద్రత సమిష్టి బాధ్యత. నిర్భయ ఫండ్ కోసం రూ.1000 కోట్లు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ లోటు 5.2 శాతం.
- పన్నుల విధానంలో పారదర్శకత టాక్స్ అడ్మిస్టేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు.
- ఆదాయ పన్ను విధానం యథాతథం.
- ఏడాదికి రూ.2-5 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారికి రెండు వేల పన్ను మినహాయింపు.
- ఏడాదికి కోటి ఆదాయంపైన ఉన్నవారికి 10 శాతం సర్‌చార్జి. మొత్తం 42,800 మందికి వర్తింపు.
- ఉద్యోగులకు పన్ను రాయితీ.
- రూ.50 లక్ష లు దాటిన స్థిరాస్తి విక్రయంపై ఒక శాతం పన్ను . వ్యవసాయ భూములకు మినహాయింపు.
- టీవీ సెట్అప్ బాక్స్ దిగుమతులపై 5 శాతం సుంకం.
- ఏసీ లగ్జరీ కార్లపై సుంకం పెంపు.
- సిగిరెట్లపై 18 శాతం పన్ను పెంపు.
- పెరుగనున్న విదేశీ కార్ల ధరలు.
- రెండు వేలు దాటిన సెల్‌ఫోన్‌పై 6 శాతం సుంకం పెంపు.
- ఏసీ ఉన్న అన్ని హోటళ్లకు సర్వీస్ ట్యాక్స్.

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.