Publish Date:Jan 20, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనకిలా సిట్ నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నోటీసులు జారీ కావడానికి ముందు సిద్దిపేట పర్యటనలో ఉన్న హరీష్ రావు మంత్రుల్లో వాటాల కొట్లాట జరుగుతోందనీ, మంత్రి సురేఖ పీఏ వ్యవహారం నుంచి మొదలు పెడితే తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు దలలో వాటాల అంశం వరకూ వాటాల కోసం గొడవ పడుతున్నారంటూ ఓ జాబితా ఏకరవు పెట్టారు హరీష్. అంతే కాదు.. మీరు ప్రతిదానిపైనా సిట్ వేస్తుంటారు కదా... సింగరేణి బొగ్గు కాంట్రాక్టు పనుల్లో జరిగే అవినీతిపై కూడా సిట్ వేయాలని సవాల్ చేస్తూ..సిట్ కాదు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీ కాదు.. ఈ రాష్ట్రానికి అత్యవసరంగా కావల్సింది న్యూస్ ట్యాపింగ్ మీద ఎంక్వయిరీ అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత హరీష్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ నడుస్తోంది. తమకున్న మీడియా పలుకుబడి ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎక్కువగా ఇరుక్కోకుండా ఈ పథక రచన చేసినట్టు కనిపిస్తోంది.
ఇదే అంశంలో ఇక్కడి నుంచి జగన్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం. దీంతో కారు- ఫ్యాను పార్టీలు రెండూ కలసి తెలంగాణలో ఒక అలజడి సృష్టించేందుకే.. వెంకటరెడ్డి- మహిళా ఐఏఎస్ వ్యవహారం తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. దెబ్బకు దెబ్బ తీసేలా ఈ తేనెతుట్టె కదిపినట్టు సమాచారం. ఇందుకు సర్కార్ కూడా అటు వైపు నుంచి నరుక్కొస్తోంది. తమకున్న మీడియా బలం ద్వారా.. దీన్ని తిప్పి కొట్టే యత్నం చేస్తోంది. దీంతో ఇద్దరు మీడియా అధినేతలు చెరో వైపూ చీలి.. కొట్లాడుతున్న దృశ్యం తెలంగాణలో తొలిసారి కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-versus-congress-25-212774.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.