అధికారంలో ఉన్నంత కాలం పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించిన బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లతో పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టి మరీ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బయటకు వచ్చినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పార్టీ జీరో ఫలితాన్ని సాధించడంతో ప్రజలకు పూర్తిగా మొహం చాటేశారు. మరి కొంత కాలం ఆయన ఇదే విధంగా అజ్ణాత వాతం కొనసాగిస్తే.. జనం ఆయనను మరచిపోయే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీని ఆయన కుమారుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏదో విధంగా నడుపుతున్నారు. అయితే ఆయన ఎక్కువగా సామాజిక మాధ్యమంపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియా వింగ్ పైనే ఆయన ఎక్కువగా ఆధారపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన కంటే సోషల్ మీడియాలో వైరల్ అయితేనే లాభం అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉందన్న విమర్శలు పార్టీలోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే సింపతీ గెయినింగ్ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో త్వరలో అంటే ఇహనో ఇప్పుడో ఓ కీలక నేత అరెస్టునకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందన్న సమాచారం బాగా వైరల్ అవుతోంది. స్వయంగా కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఆ అరెస్టు ద్వారా తన ఏడాది పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చాలని రేవంత్ భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ కీలక అరెస్టు అన్నది ఎంత వ రకూ నిజమో ఎవరికీ తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం దీనికి విపరీతంగా ప్రచారం ఇస్తోంది. తద్వారా ప్రజల నుంచి సానుభూతిని మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-social-media-predict-key-leader-arrest-39-187855.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.