బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు?

Publish Date:Apr 26, 2025

Advertisement

సర్వత్రా అదే ఉత్కంఠ!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ  వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల  మంది  సభకు వస్తారన్న అంచనాలతో  ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏ లోటూ లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగా ఃకుండ.. వైద్య సేవలు, అంబులెన్స్ లు సహా అని సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరో వంక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన గులాబీ పార్టీ పాతికేళ్ల   పండుగను, ధూమ్ ధామ్ గా, అత్యంత వైభవంగా, నభూతో నభవిష్యత్  అన్న విధంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ గత నెల రోజులకు పైగానే కసరత్తు చేస్తోంది. ఓ వంక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తునారు. సభను ఎలా సక్సెస్ చేయాలనే విషయంలో నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఒక్కసారి ఓడిపోయినా, మళ్ళీ వచ్చేది మనమే  అన్న భరోసా ఇస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో వంక పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యనాయకులు జిల్లాలలో పర్యటించి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ పై గులాబీ దళం ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఒక విధంగా చూస్తే రజతోత్సవ సభను బలప్రదర్శన సభగా నిర్వహించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

అయితే  రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించడం సహాజమే.  అయితే..  ఎన్నికల సమయంలో లేదా ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తాయి.  అయితే, బీఆర్ఎస్  ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని బల ప్రదర్శన లక్ష్యంగా సభను నిర్వహిస్తోంది  అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్ లో పంచాయతీ ఎన్నికలు,  వస్తే గిస్తే, ఆ పది నియోజక  వర్గాల ఉప ఎన్నికలు మినహా చెప్పుకోదగ్గ ఎన్నికలు ఏవీ కనిపించడం లేదు.అయినా, బీఆర్ఎస్ పదిలక్షల మందితో భారీ బహిరంగ సభను ఈ సమయంలో ఎందుకు నిర్వహిస్తోంది? ఈ సభ నిర్వహించేందుకు గులాబీ  పార్టీ  ఇంచుమించుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ..  జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార హోరు చూస్తుంటే, ఇంకొంచెం ఎక్కువే ఖర్చయినా ఆశ్చర్య పోనవసరం లేదని కారు నేతలే అంటున్నారు. అవును.. డబ్బుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే.., ఈ సమయంలో  ఎందుకింత ఆర్భాటం, ఎందుకీ బల ప్రదర్శన అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు. 

ఆఫ్కోర్స్.. ఒక పార్టీ చరిత్రలో రజతోత్సవాలకు ఉండే ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ఎవరూ కాదన లేరు. నిజానికి  ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లు  మనుగడ సాగించడమే గొప్ప విషయం.   ముఖ్యంగా.. ఒక ఉద్యమ పార్టీగా.. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే సింగల్ పాయింట్ ఎజెండాగా  పుట్టిన పార్టీ పాతికేళ్ళు ప్రస్థానం సాగించడం సాధారణ విషయం కాదు.  అందుకే    బీఆర్ఎస్ గాపేరుమార్చుకున్న టీఆర్ఎస్  రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకున్నా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. అందులోన.. ,ఈ పాతికేళ్లలో గులాబీ పార్టీ,రాష్రాన్ని సాధించి, లక్ష్యాన్ని చేరుకోవమే కాకుండా, దేశ  రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత  ప్రభావితం చేసింది.

అవును..  ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా (14 ఏళ్ళు) ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రన్ని సాధించినగులాబీ పార్టీ, పదేళ్ళ అధికార పార్టీగా ఓ వెలుగు వెలిగిన పార్టీ రజతోత్సవాలను జరుపుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ..  కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నికల సభను తలపించే విధంగా లక్షల మందితో సభను నిర్వహించడం  ఎందు కోసం?  దేనికి సంకేతం?  అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు.

అదొటి అయితే..  రజతోత్సవ సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసేఅర్  ఏమి మాట్లాడతారు?  అనేది   ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు. గడచిన 15- 16 నెలల్లో కేసీఆర్ ఫార్మ హౌస్ గడపదాటి బయటకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక బహిరంగ సభలో ప్రసంగించి కూడా చాల కాలమైంది. ఎప్పుడో  సంవత్సరం సంవత్సరం క్రితం నల్గొండ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కనిపించారు. అంతే..  ఆ తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన లేదు. సో .. సహజంగానే  కేసీఆర్ ఏమి మాట్లాడతారు అన్నది  మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు బీఆర్ఎస్ వారికే కాదు, కాంగ్రెస్, బీజేపీ వారికి, సామాన్య ప్రజలకు కూడా ఆసక్తి కల్గిస్తోంది.

అయితే..  విశ్వసనీయ సమాచారం మేరకు  కేసీఆర్... తెలంగాణ ఉద్యమ చరిత్రతో  మొదలు పెట్టి.. బీఆర్ఎస్పదేళ్ళ పాలన,  ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా  కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైనే, కేసీఆర్ ఫోకస్  ఉంటుందని, అంటున్నారు. మరోవంక, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ఏమి మాట్లాడతారు? అనేది కూడా ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు. అలాగే.. ఈ సభ తర్వాత కేసీఆర్ ఏమి చేస్తారు?  బ్యాక్ టూ ఫార్మ్ హౌస్ అంటారా? ముందుండి పార్టీని నడిపిస్తారా అ నేది అన్నిటినీ మించిన  వంద కోట్ల ప్రశ్న.

By
en-us Political News

  
అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు.
తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు.. ఆయన అసంతృప్తికి ఇంకా చాలా కారణాలున్నాయి. అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
అమరావతిపై, అమరావతి మహిళలపై జగన్ మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మీడియాలో ఓ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా వత్తాసు పలికిన ఆ మీడియా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది.
ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులోనూ గుంటూరులో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికలకు ముందు వరకూ గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది. ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు.
సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు.
జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
అమ‌రావ‌తిపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.