త్వరలో కవిత కొత్త పార్టీ ! తండ్రికి లేఖ వెనుక ఎత్తుగడ ఇదే !

Publish Date:May 23, 2025

Advertisement

 

క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని  విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం. ఇదంతా జ‌రిగే ప‌నేనా? అందుకా అవ‌కాశాలున్నాయా? అని ఆలోచిస్తే.. ఇదంతా నేరుగా కేసీఆర్ నుంచే వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌గా తెలుస్తోంది. గులాబీ బాస్ త‌న ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అల్లుడు హ‌రీష్ రావ్ కి ఇస్తే ఆయ‌న స‌సేమిరా అన్నాడని స‌మాచారం. మామ‌కు ద్రోహం చేసిన రెండో చంద్ర‌బాబును అవుతాను. అది నాకిష్టం లేదు. ఆ ముద్ర నేను వేయించుకోలేన‌ని డైరెక్టుగా విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ రావు చెప్ప‌డం కూడా అంతే వాస్త‌వం. ఒక వేళ అలా జ‌రిగినా కూడా తాను త‌న మామ కేసీఆర్ బ‌తికుండ‌గా పార్టీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. క‌ట్ చేస్తే పార్టీలో ప్ర‌స్తుతం కేసీఆర్ త‌ర్వాత అంత‌టి సుప్రిమో కేటీఆరే. త‌ర్వాత హిమాన్షు ప‌రం అవుతుందేమోగానీ మ‌రెవ‌రికీ ఇందులో భాగ‌స్వామ్యం లేదు. 

ఇక్క‌డ కేసీఆర్ అస‌లు ప్లానేంటంటే డీఎంకే, అన్నాడీఎంకేలాగా.. పార్టీ చీలినా పెద్ద స‌మ‌స్య‌లేద‌ని.. అధికారం మాత్రం మ‌న ఇంట్లోనే ఉండాల‌న్న‌ది చంద్ర‌శేఖ‌ర‌రావు అస‌లు ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. అలా తొలుత హ‌రీష్ రావును ఆ దిశ‌గా ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది ఆదిలోనే హంస‌పాదులా మారిందట‌. అప్ప‌ట్లో అమిత్ షా కూడా హ‌రీష్ రావును గ‌ట్టిగానే ట్రై చేసిన‌ట్టు స‌మాచారం. హ‌రీష్ బీజేపీలోకి వెళ్తారేమోన‌ని కేసీఆర్ కూడా బాగానే ఎదురు చూశార‌ట‌. అలాగైనా మ‌న‌లో ఒక‌డు ఇత‌ర పార్టీలోకెళ్లి అక్క‌డి నుంచి అధికారంలో ఉండ‌టం కూడా క‌లిసొచ్చే అంశ‌మే అన్న‌ది కేసీఆర్ అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఇప్పుడు.. చూడండీ ఎక్క‌డి నుంచో పొడుచుకొచ్చిన రేవంత్ సీఎం అయి కూర్చుని కాళేశ్వ‌రం గుంత‌లు మొత్తం త‌వ్వుతున్నాడు. ఏమో కాంగ్రెస్ వాళ్లే కాళేశ్వ‌రాన్ని పేల్చేశారేమో అని కేటీఆర్ ఎంత బ‌నాయిస్తున్న.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. రేవంత్ అయితే సీఎం ఐయిపోయాడు.. క‌ల్వ‌కుంట్ల కుటుంబం ముక్కు పిండుతున్నారు.

అదే గ‌తంలో కేసీఆర్ ఆశించిన‌ట్టు హ‌రీష్ పార్టీ బ‌య‌ట‌కు వెళ్లి ఏ బీజేపీలోనో చేరి ఉంటే.. అప్ప‌టికి మంచి ఫామ్ లో ఉన్న బీజేపీ అధికారంలోకి వ‌చ్చి.. హ‌రీషే సీఎం అయి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేదిగా.. అన్న‌ది కేసీఆర్ మ‌న‌సులో మ‌రుగుతోన్న‌ట‌ ఆలోచ‌న‌ట‌.ఇదంతా ఇలా ఉంటే అల్లుడి వ‌ల్ల ఎలాగూ వ‌ర్కువుట్ కావ‌డం లేదు.. ఈయ‌న సంగ‌తి ఇలా ఉంచి.. త‌న కూతురి ద్వారా మ‌రో ప్ర‌యోగం చేసి చూద్దాం.. త‌ద్వారా ఏదైనా స‌క్సెస్ సాధించ‌వ‌చ్చేమో. పోతే వెంట్రుక వ‌స్తే కొండ‌.. అన్న కోణంలో ఇప్పుడు కూతురు క‌విత  నుంచి న‌రుక్కొస్తున్న‌ట్టుస‌మాచారం.క‌విత వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌ని.. చూస్తే.. అట్ లీస్ట్ ఓట్ల‌ను చీల్చి.. బీఆర్ఎస్ కి స‌పోర్ట్ చేయ‌నైనా చేయ‌రా? అన్న‌దొక అంచ‌నా. ఆమె ఎవ‌రి ఓట్లు చీలుస్తారు? ఆమె వెన‌క దాగిన ఓటు బ్యాంకు ఎలాంటిద‌ని చూస్తే.. ఆమె తొలి నుంచి తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ఆడ‌ప‌డుచుగా చేసిన బ‌తుక‌మ్మ‌లు మ‌హిళా లోకాన్ని ఆక‌ర్షించాయి. ఈ దిశ‌గా మ‌హిళా ఓటు బ్యాంకును కాస్త క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు. ఇక పోతే బీసీ ఓటు బ్యాంకు. బీసీల వాణి వినిపించ‌డంలోనూ క‌విత ఒక ప్ర‌యార్టీగా తీసుకున్నారు. 

దానికి తోడు తెలంగాణ‌లో బీసీల గురించి భారీ ఎత్తున కొట్లాట న‌డుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ వ‌ర్సెస్ తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ పోరు షురూ  అయ్యింది. మ‌ల్ల‌న్న అయితే ఏకంగా బీసీల కోసం త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయాడు. రెడ్ల‌తో ఢీ అంటే ఢీ అన్నాడు. దానికి తోడు రేవంత్ రెడ్డే చివ‌రి రెడ్డి సీఎం కావాల‌ని అన్నాడు. ఈ బీసీ బ్యాగ్రౌండ్ లోకి క‌విత సైతం ప్ర‌వేశించి.. ఇక్క‌డ నాలుగు ఓట్లు చీలినా.. త‌న బీఆర్ఎస్ కి ఆమె మేలు చేసిన‌ట్టే లెక్క‌!ఇలా ప‌రి ప‌రివిధాలా ఆలోచించి క‌విత  ను ఒక బాణంగా ప్ర‌యోగించాల‌ని కేసీఆర్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా జ‌రిగే అవ‌కాశ‌ముందా? గ‌తంలో ఎవ‌రైనా ఇలా చేశారా? అని చూస్తే జ‌గ‌న్ త‌న సోద‌రి ష‌ర్మిళ‌ను కూడా స‌రిగ్గా ఇలాగే వినియోగించిన‌ట్టు ఒక టాకుండేది అప్ప‌ట్లో. ఆమె ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించి.. మొద‌ట ఇక్క‌డ త‌న పార్టీని తెలంగాణ‌లో తెరిచి తిరిగి అక్క‌డ ఏపీలోకి వెళ్లి.. త‌మ ఓటు బ్యాంకు చీలి కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌డ‌కుండా ఒక కాపు కాచార‌న్న‌ది అప్ప‌ట్లో వినిపించిన మాట‌. 


అలా క‌విత కూడా ఒక రాజ‌కీయ ప్ర‌యోగంగా తాను సైతం త‌న బీఆర్ఎస్ కి ఒక బీ టీంని ఎందుకు ఏర్పాటు చేసుకోవ‌ద్దు? మ‌న‌కి బీజేపీకి లింకు అంట‌గ‌ట్టి ఈ బీటీ మ్ ప్రాప‌గాండా చేయించుకోవ‌డం కంటే ఇదే మేలు. అదే మ‌న ద‌గ్గ‌ర ఒక సైడు దుకాణం ఉంటే.. దానితోనే లింకు పెట్టి మాట్లాడ‌తారు. దీంతో డ్యామేజీని భారీగా మేనేజ్ చేయొచ్చుగా అన్న‌ది క‌విత త్రూ కేసీఆర్ ఆడుతున్న మ‌రో రాజ‌కీయ డ్రామాగా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు ఆర్కే రేంజ్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు.కేసీఆర్ కి తొలి నుంచి ఇలాంటి ప్ర‌యోగాలు ముక్కుతో పెట్టిన విద్య‌. ముక్కాయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. విజ‌య‌వంత‌మైన టీఆర్ఎస్ పేరు కూడా బీఆర్ఎస్ అంటూ పేరు మార్చిన ఆయ‌న‌కు క‌విత ద్వారా మ‌రో తెలంగాణ శ‌బ్ధంతో కూడిన పార్టీ పెట్టించ‌డం ఒక లెక్క కాదు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా పలు పార్టీ పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. ఇక నేడో రేపో క‌విత నుంచి ఈ సౌండ్ మ‌నం విన్నా వినొచ్చ‌ని రాజ‌కీయ అభిజ్ఞాన వ‌ర్గాల భోగ‌ట్టా.

By
en-us Political News

  
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.