బీఆర్ఎస్ డ‌బుల్ గేమ్‌.. టార్గెట్ రేవంత్!

Publish Date:Sep 29, 2024

Advertisement

తెలంగాణ రాజకీయానికి హైడ్రా కేంద్ర బిందువుగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం హైడ్రా పేరు మారుమోగుతుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువులు, నాలాలు క‌బ్జాలుచేసి చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌పై రేవంత్ స‌ర్కార్ కొర‌డా ఝుళిపించిస్తోంది. అయితే, హైడ్రా ప్రారంభంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీఆర్ఎస్ సైతం తొలుత హైడ్రాపై నోరుమెద‌ప‌లేదు. మేముకూడా అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయ‌డానికి అనుకూల‌మేన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసింది. బీజేపీలోని ఓ వ‌ర్గం హైడ్రాకు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ తో స‌హా ప‌లు అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేసిన స‌మ‌యంలో హైడ్రాతో రేవంత్ మంచిప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. అయితే, క్ర‌మంగా హైడ్రాకు రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో వ్య‌తిరేక‌త మొద‌లైంది. అయితు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా విష‌యంలో ఎక్క‌డా తగ్గేదేలే అని స్పష్టంగా చెబుతున్నారు. చెరువులు, నాలాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారు ఎంత‌ ప‌లుకుబ‌డి ఉన్న వారైనా వ‌దిలిపెట్టేది లేద‌ని ప‌లు స‌భ‌ల్లో ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. దీంతో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మ నిర్మాణాల‌ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ పోయింది. ఈ క్ర‌మంలో అంతే స్థాయిలో వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో పేద‌ల ఇళ్ల‌ను సైతం హైడ్రా కూల్చివేస్తుండ‌టం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు  రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ షురూ చేసింది.

 హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ కు బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేశారు. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రులు వైఎస్ఆర్‌, కేసీఆర్‌లు న‌గ‌రాన్ని అభివృద్ధి ప‌థ‌ంలో న‌డిపించారు. దీంతో భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపే పెద్ద‌పెద్ద కంపెనీల ప్ర‌తినిధులు సైతం త‌మ ఎంపిక‌లో హైద‌రాబాద్ ను త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే స్థాయికి న‌గ‌రం చేరిపోయింది. అయితే, ఇక్క‌డ అస‌లు వాస్త‌వాల‌ను ప్ర‌స్తావిస్తే.. హైద‌రాబాద్‌లో కొన్ని ప్రాంతాలు మాత్ర‌మే అభివృద్ధి చెందాయి. కొన్ని ప్రాంతాలు ఇప్ప‌టికీ మురికి వాడ‌ల్లానే ఉన్నాయి. చిన్న‌పాటి వ‌ర్షం వ‌చ్చినా రోడ్లు జ‌ల‌మ‌యం అవుతాయి. ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణం న‌గ‌రంలోని చెరువులు, నాలాల‌ను ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేయ‌డ‌మే. గ‌త‌ బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ హ‌యాంలో కేసీఆర్ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చేస్తామ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. కానీ ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా చిన్న‌పాటి వ‌ర్షానికే న‌గ‌ర ప్ర‌జ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించి  హైడ్రాకు ప్రాణం పోశారు. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రి వర్గ సహచరులు చెప్పినా రేవంత్ ప‌ట్టుద‌ల‌తో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చేస్తున్నారు. అయితే, తొలుత స‌మ‌ర్ధించిన బీజేపీ, బీఆర్ఎస్ లు.. ప్ర‌స్తుతం ప్లేట్ ఫిరాయించాయి.  రేవంత్ రెడ్డి టార్గెట్‌గా రాజ‌కీయాల‌ను షురూ చేశాయి. 

హైడ్రా విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ డ‌బుల్ గేమ్ ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హైదరాబాద్‌లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి.. వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం.. వరదల నుంచి నగరానికి విముక్తి కల్పిస్తామని బీఆర్ఎస్ హయాంలో 2016లోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పిందో దానినే నేడు కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుంటే.. కూల్చివేతలు సమంజసం కాదంటూ బీఆర్ఎస్ వితండ‌ వాదన చేస్తోందని కాంగ్రెస్ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలోనే మూసీనీ సుందరీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ సుందరీకరణ కోసం మూసీ పరిసరాల్లోని నివాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఇండ్ల  కూల్చివేతలు చేపడతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే మూసీ బాధితులకు పరామర్శ అంటూ బీఆర్ఎస్ యాత్రలతో యాగీ చేస్తోంది. దీంతో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కేసీఆర్ వాదనకు వ్యతిరేకంగా హరీష్ , కేటీఆర్ ఉద్యమం చేపడుతున్నారని   బీఆర్ఎస్ పై  కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదేక్ర‌మంలో గ‌తంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో…ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… కేసీఆర్ కు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఇప్పటికే పలుచోట్ల హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తం అవుతుండగా.. మూసీ సుందరరీకరణ కోసం మరికొన్ని ఇండ్లను కూల్చివేతలకు  హైడ్రా సిద్ధమవ్వడంతో రచ్చ పతాక స్థాయికి చేరుకుంది.  మూసీ ప‌రిధిలోని ఇండ్ల‌కు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే   బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ యాత్ర చేపట్టింది. గోదావరి నీళ్ళేమోకానీ ప్రజల రక్తం పారుతున్నది అంటూ హరీష్ రావు హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలోని పేద‌ల ఇల్లు కూల్చాలంటే మామ్మ‌ల్ని దాటుకొని వెళ్లాల‌ని హ‌రీశ్ రావు సవాల్ విసిరారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీలు బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్ సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల ఇండ్ల‌ను కూల్చాలంటే ముందు మాపై బుల్డోజ‌ర్లు ఎక్కాల‌ని ప్రకటనలు చేశారు. బీఆర్ ఎస్‌, బీజేపీలు యూట‌ర్న్ తీసుకొని హైడ్రా కూల్చివేతలు రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయ‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. స్థానిక ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు ఆ రెండు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి.

 ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హైడ్రా కూల్చివేతలపై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయించి ఆ తర్వాత ఖాళీ చేయించాల్సిందన్నారు. హైడ్రా అధికారులు మాత్రం .. మూసీ ప‌రివాహ‌క ప్రాంతం నుంచి ఎవ‌రినీ బ‌ల‌వంతంగా పంపించ‌డం లేద‌ని, అంద‌రితో మాట్లాడి, ఒప్పించి, సుర‌క్షితంగా త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో హైడ్రా వ‌ల్ల ఇల్లు కోల్పోయిన ప్ర‌తీ ఒక్క‌రికి డ‌బుల్ బెడ్‌రూం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ, బీఆర్ ఎస్‌, బీజేపీ నేత‌లు మాత్రం అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పోటీప‌డుతూ రేవంత్ టార్గెట్ గా విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. రేవంత్ సైతం ఎట్టిప‌రిస్థితుల్లోనూ హైడ్రా విష‌యంలో త‌గ్గేది లేద‌ని తేల్చ‌చెబుతుండ‌టంతో రాబోయేకాలంలో హైడ్రా రాజ‌కీయం ఎటు మ‌లుపు తిరుగుతుందోన‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.