జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ చేతులెత్తేసిందా?

Publish Date:Oct 15, 2025

Advertisement

జూబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచాయి. బీజేపీ ఇంకా ఒకింత సైలెంట్ గానే ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కంటే ముందుగానే బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ఆరంభించేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి బీఆర్ఎస్ సానుభూతి వేవ్ పై నమ్మకం పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ ఒకింత ఆలస్యమైనా బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపిందని పరిశీలకులు అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ నినాదంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణల వ్యూహం ఆ పార్టీకి ఈ ఎన్నికలలో ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. వాటిపై కూడా నమ్మకం సన్నగిల్లి.. నకిలీ ఓట్లు, అధికారులు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించడం ద్వారా ముందుగానే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో  కేటీఆర్.. వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు సహజంగా ఓటమి భయం నుంచి పుట్టుకువస్తాయని రాజకీయ పండితులు అంటుంటారు.  కేటీఆర్.. బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఓటమి భయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమంగా ఇరవై వేల ఓట్లు చేర్చారంటూ కేటీఆర్ నేరుగా సీఈవోకు ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలను రుజువుగా ఆయన  ఓ ఇంట్లో ఏకంగా నలభై మూడు ఓట్లు ఉన్నాయంటున్నారు. అవన్నీ దొంగఓట్లేనని చెబుతున్నారు. ఈ ఆరోపణనే ఆయన కాంగ్రెస్ పై ప్రయోగించిన పెద్ద ఆయుధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేత బీహార్ లో ఓట్ల చోరీ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారనీ, ఇక్కడ తెలంగాణలో వారి కాంగ్రెస్ పార్టీయే ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంటే పెదవి విప్పడం లేదనీ ఆలోచించారు. సరే కేటీఆర్ ఆరోపణపై స్పందించిన ఎన్నికల సంఘం..ఆ ఇంటిలో 43 ఓట్లపై పరిశీలించి.. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని, అది బహుళ అంతస్తుల భవనమని తేల్చేసింది. 

అది పక్కన పెడితే.. కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ తమ ప్రచారంలో జూబ్లీలో గెలిపిస్తే ఏం చేస్తామన్నది చెప్పడం లేదు.. కానీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందంటూ ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారు. తమకు ఓటు వేయడం అని అడగడానికి బదులు కాంగ్రెస్ కు ఓటే వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.  ఈ రకమైన డిఫెన్సివ్ వైఖరి బీఆర్ఎస్ లోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.