Publish Date:Sep 26, 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. సంప్రదాయాన్ని దాటకుండా.. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఆ సీటును ఆయన సతీమణి మాగంటి సునీతకే కేటాయించారు. దీంతో జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న సందిగ్ధతకు కేసీఆర్ తెరవేశారు. అనవసర ఊహాగానాలకు తెరదించుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందుగానే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల సానుభూతితో పాటు.. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కీలక సామాజిక వర్గ మద్దతు కూడా లభిస్తుందన్న అంచనాతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.
అలాగే పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ మాగంటి కుటుంబానికి అవకాశం ఇస్తేనే బెటర్ అని తేలిందని, దీంతో ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఇందులో మొదటి సారి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందగా, తరువాత రెండు సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచారు.
ఏవరు ఔనన్నా కాదన్నా, జూబ్లీ బైపోల్ లో విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. తాము పుంజుకుంటున్నామనీ, మళ్లీ ప్రజాదరణ పొందుతున్నామనీ నిరూపించుకోవాలంటే జూబ్లీ బైపోల్ లో విజయం తప్పని సరి. ఎందుకంటే ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది. అంతే కాకుండా ఆ స్థానంలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ను బైపోల్ లో కోల్పోతే.. పార్టీ క్యారడ్ స్థైర్యం పూర్దిగా దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, అన్నివిధాలుగా ఆలోచించే.. ఇప్పుడు అభ్యర్థిని కూడా ప్రకటించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-candidate-maganti-sunitha-in-jublee-by-poll-39-206940.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.