వ్యూహాలు బెడిసికొట్టాయి.. కింకర్తవ్యం?

Publish Date:Dec 27, 2024

Advertisement

సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తదననంతర పర్యవశానాలను గమనిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు తెలుగు సినీ పరిశ్రమను తన గుప్పిటిలోకి తెచ్చుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్, బీజేపీలను కంగు తినిపించారు. చాలా దృఢంగా నిలబడి.. తెలుగు సీనీ పరిశ్రమ మెడలు వంచడమే కాకుండా.. సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటనను ఆసరాగా చేసుకుని రేవంత్ సర్కార్ ను బదనాం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీలు వేరు వేరుగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు తడబడేలా చేయగలిగారు.

ఈ విషయం గురువారం (డిసెంబర్ 26) సినీ ప్రముఖులతో రేవంత్ జరిపిన భేటీ అనంతరం నిర్ద్వంద్వంగా స్పష్టమైపోయింది.    పుష్ప 2సినిమా ప్రీమియర్ షో సందర్భంగా  సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ గత 20 రోజులుగా కోమాలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాట  ఘటనకు పుష్ప2 సినిమా హీరో అల్లు అర్జున్ కారకుడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ తరువాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. దీంతో ఒక్క రాత్రి చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ విడుదలయ్యారు. అది వేరు సంగతి. కానీ ఎప్పుడైతే పోలీసులు అల్లుఅర్జున్ పై కేసునమోదు చేశారో అప్పటినుండి బీఆర్ఎస్, బీజేపీలు పోటీలు పడి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్  చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలూ  అల్లు అర్జున్ కు ఏకపక్ష మద్దతు ప్రకటిస్తూ రేవంత్ సర్కార్ తెలుగు సినీమా పరిశ్రమను తెలంగాణ నుంచి తరిమేయాలనుకుంటోందా అన్న లెవల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత అల్లుఅర్జున్ పై పోలీసులు కేసు పెడతారా ? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, అటు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ లాంటి సెలిబ్రిటీకే  తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఇక సామాన్యులకు రేవంత్ రెడ్డి ఎవరో ఎలా తెలుస్తుందంటూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేసి సంబరపడిపోయారు.  

అల్లు అర్జున్ పై కేసు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి చేయగ లిగినంతా చేశాయి బీఆర్ఎస్, బీజేపీలు. ఈ విషయంలో అల్లు అర్జున్ కు పోటీలు పడి మద్దతు తెలపడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు పార్టీలూ నేల విడిచి సాము చేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. దీంతో పరిస్థితి ప్రభుత్వం ఒక వైపు అల్లు అర్జున్, టాలీవుడ్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక వైపు అన్నట్లుగా మారిపోయింది.  

అయితే గురువారం (డిసెంబర్ 27) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తరువాత బీఆర్ఎస్, బీజేపీలు అల్లు వెనుక ర్యాలీ అవ్వడం ఎంత హేతు రహితం అన్న విషయం ప్రస్ఫుటంగా తెలిపోయింది. సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ అత్యుత్సాహంతో నిర్వహించిన ర్యాలీయే కారణమని సినీ ప్రముఖులంతా ఆ భేటీలో అంగీకరించేసినట్లుగానే కనిపించింది. అంతే కాదు.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని రేవంత్ వారికి కరాఖండీగా చెప్పడమే కాకుండా, రాష్ట్రంలో టాలీవుడ్ కు అన్ని విధాలా సహకారం అందిస్తానని చెబుతూనే పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించి తీరాలని స్పష్టం చేశారు. 

ఇక ఆ భేటీ తరువాత మరో విషయం ప్రస్ఫుటమైంది. సినీ ప్రముఖులంతా దాదాపుగా సీఎంకు సాగిలపడ్డారు.   తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండవన్న తన మాటకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ కుండబద్దలు కొట్టినా... ఆయనను పొగిడేందుకే సినీ ప్రము ఖులు పాటుపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేందుకు సహకరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారనీ, అందుకు తమకు భారీ టాస్క్ ఇచ్చారనీ, దాని ముందు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చాలా చిన్నవంటూ నిర్మాత దిల్ రాజు సినీ ప్రముఖుల తరఫున ప్రకటించేశారు.

ఈ మెత్తం వ్యవహారంలో సినీ ప్రముఖులంతా సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ దే తప్పు అని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. ఈ సమావేశం వల్ల సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేకపోయినా రేవంత్ ను పొగడడానికీ, ఆయనకు శాలువాలు కప్పడానికీ సినీ ప్రముఖులు పోటీలు పడటం చూస్తుంటే  సంధ్యా థియోటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదాన్ని అంగీకరించి.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పరామర్శలకు క్యూకట్టినందుకు రేవంత్ కు సారీ చెప్పినట్లు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒక సారి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అర్ధమైన తరువాత పరిశ్రమ పెద్దలలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. తొలుత కమేడియన్ రాహుల్ రామకృష్ణతో మొదలై... నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వరకూ ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి సంధ్యా థియోటర్ తొక్కిసలాట ఘటనకు బాధ్యుడు అల్లు అర్జున్ అని చెప్పడానికి వెనుకాడటం లేదు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ ఒకింత స్పష్టంగానే అల్లు అర్జున్ నాలుగు కార్లతో ర్యాలీగా సంధ్యాథియోటర్ కు వెళ్లి రోడ్ షో చేయడం తప్పేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో బాలకృష్ణ వంటి హీరోలు తమ సినీమాలను తొలి రోజు ప్రేక్షకులతో కలిసి చూశారనీ, అయితే వారెవరూ ఇలా రోడ్ షో చేయలేదని గుర్తు చేశారు కూడా.  

 హీరోలు కూడా సాధారణ మనుషులేనని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అల్లు అర్జున్ కు చురకలంటించారు.  దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజ కీయ లబ్ధి కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలు వికటించాయి. దీంతో ఆ పార్టీ నేతలు కింకర్తవ్యం అన్న డైలమాలో పడ్డారు. 

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.