Publish Date:May 31, 2021
కరోనా కాలమో, కలికాలంలో తెలియదు గాని.. బయటి వాళ్ళతో నడిపే ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళతో సాగిస్తున్నారు. అసలే కరోనా కాలం.. అందులోను లాక్ డౌన్ ఇతరులను కలవడం వీలు కాదు. ఒక వేళ కలిసిన సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని అనుకుంటున్నట్లున్నారు. ప్రస్తుతం యువతీ యువకులు. అందుకే ఇంట్లో వాళ్ళతో ప్రేమాయణం నడుపుతున్నట్లున్నారు.. ఆ రుచి చూశాక ఒకరి ఒకరి ఉండలేమని.. వావివరసలు మరిచి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఒక జంట ఇలాగే చేసింది..
వారిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు. ఆ వరసను మరిచి వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా.. అది కృష్ణ జిల్లా. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురానికి చెందిన పేరుబోయిన సాయికుమార్(20) గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పేరుబోయిన వెంకటస్వామి కుమార్తె(15)కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తెలుసుకున్న కుటుంబసభ్యులు.. వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏంటని మందలించారు.
కట్ చేస్తే.. ఈ నేపథ్యంలోనే ఈ ప్రేమజంట ఇంట్లో ఉంటె వాళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించారని గ్రహించి శనివారం రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఎప్పటి లాగే ఉదయాన్నే లేచి చూస్తే అమ్మాయి, అబ్బాయి కనిపించడం లేదు. దీంతో కంగారు పడిన రెండు కుటుంబాల వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పంట పొలాల వద్ద చెట్టుకు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏమిటి ఈ దరిద్రం మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం.. వయసు వస్తే చాలు ప్రేమ రుచి చూడాల్సిందేనా.. ఈ తప్పు పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రులదా ..? లేదా తల్లి దండ్రుల మాట లెక్క చేయని పిల్లలదా..? అయినా అక్క తమ్ముడు లవ్ చేసుకోవడం ఏంటి.. అని స్థానికులు మాట్లాడుకుంతున్నారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించండి. వారి నడవడికను గ్రహించండి. వారి తప్పులను సరిదిద్దండి. తల్లి దండ్రులు చదివిన వాళ్ళు అయినా చదవని వాళ్ళు అయినా సరే వారికి తెలిసిన విషయాలు వాళ్ళతో పంచుకోండి.. ఈ బిజీ ప్రపంచంలో పిల్లలను అందరు ఉన్న అనాథలా వదిలేయకండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brother-sister-love-25-116608.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.