Publish Date:Oct 14, 2022
తండ్రికి చికిత్స చేయించాలని హీరో తన స్నేహితులతో పాటు ఆయన్ను పక్క ఊర్లో ఆస్పత్రికి తీసికెళు తూంటాడు. కనుచూపు మేరలో చిన్న కాలవవంతెన దాటాలి. కానీ అక్కడ విలన్ గ్యాంగ్ వెయిట్ చేస్తుం టుంది. కారు, రెండు ఆటోలూ ఆపేసి ఏటి కనుక్కోరా అని హీరో అసిస్టెంట్ని పురమాయిస్తాడు. వాడు తన్నులు తిని వస్తాడు. కార్లు, జీపులు, ఆటోలు ఇయాల ఎల్లేందుకు పర్మిసన్ ఇవ్వరంట విలన్ మాటగా చెప్పాడు. హీరోగారు తండ్రి పరిస్థితి చూసి కాస్తంత తగ్గి ఒక మైలు వెనక్కి వెళ్లి మరో మార్గంలో ఆస్పత్రికి తీసికెళతాడు. కానీ జగన్ మాత్రం రైతుల పాదయాత్రను సరిగ్గా ధవిళేశ్వరాన్ని దాటనీయకుండా చేయడా నికే కంకణం కట్టుకున్నారు.
గోదావరి నది మీద రాజమండ్రి కొవ్వూరు మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వారం రోజుల పాటు మూసివేశారు. రోడ్డు మరమ్మత్తులు ఉన్నాయని మూసేస్టున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర శనివారం కొవ్వూరు చేరాలి. అదీ ఈ బ్రిడ్జ్ మీదుగానే యాత్ర కొనసాగాలి. కానీ మరమ్మత్తు పనులు జరుగుతున్నపుడు రైతుల పాదయాత్ర ఎలా వెళుతుంది.
పాదయాత్రతో ప్రభుత్వానికి జరిగే మేలు లేదు. అందుకే వంతెన మరమ్మతు సంగతి హఠాత్తుగా గుర్తొ చ్చింది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో జనం ఇబ్బందులు పడినపుడు మాత్రం దాన్ని గురించి ఆలోచనే లేదు. ఇపుడు రైల్వేవారితో కలిసి మరమతు కుట్రకి పాల్పడ్డారన్నది పరిశీలకుల మాట. రైతుల పాదయాత్రలో వెయ్యిమందే పాల్గొంటున్నారు. వెయ్యిమంది నడిచి వెళతారు. అంతేగాని టూవీ లర్లకి పార్టీ జెండాలు కట్టుకుని గోల చేస్తూ, చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేస్తూ వెళ్లరు. పాద యాత్రకి వంతెన మరీ దెబ్బతింటుందనే ఆలోచనే అయితే సర్కారు వారి ప్రచారహోరుకి వెళ్లిన దారులన్నీ నాశనమయ్యాయి గదా వాటి సంగతేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
రిపేరు అయితే వాహనాలు రివ్వున వెళతాయిగదా! వాహనాలు వెళ్లడం కంటే పాదయాత్రలో వెళ్లై రైతు లకు పెద్దగా ప్రాధాన్యతనీయనవసరం లేదను కున్నారనే అనుకోవాలి. రైతు ఉద్యమం, పాద యాత్రలు తమ ప్రతిష్ట ను మరింత దెబ్బతీస్తున్నా యన్న అక్కసుతోనే జగన్ సర్కార్ ఊహించని చర్యలకు దిగు తోంద న్నది పరిశీలకుల మాట. అమరావతి రైతుల పాదయాత్రను ఈ విధంగా అడ్డుకోవడం నీచమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఈ చర్యలు రైతుల నిర్ణయాన్ని వేగాన్ని ఆపలేవ న్నది, తగ్గించ లేవని జగన్ సర్కార్ తెలుసుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bridge-rapairs-nothing-but-to-stop-farmaerspadayatra-25-145422.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.